జైలు లో 90 మంది భారతీయులు మరో 193 మందికి దేశ బహిష్కరణ
- December 26, 2015భారత దౌత్య కార్యాలయంలోని లేబర్ మరియు కమ్యునిటీ వెల్ఫేర్ విభాగం తమకు 4080 పిర్యాదులు అందినట్లు కమ్యునిటీ హౌస్ తెలిపింది. గత ఏడాది 3943 పిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. కేంద్ర కారాగారంలో90 మంది భారతీయులు జైలుశిక్ష అనుభవిస్తున్నారు. మరో 193 మంది దేశ బహిష్కరణ గురై స్వదేశంకు వెళ్ళడానికి టికెట్ల కోసం వేచియున్నట్లు తెలిపారు. అలాగే , ఖతర్ లో 2014 లో 279 మంది, 2015 లో ఇప్పటి వరుకు 275 మంది భారతీయులు మరణించినట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ లోపు 15 మంది చనిపోయినట్లు భారత దౌత్య కార్యాలయం వివరాలను అందిస్తుంది. బహిష్కరణ గురైన భారత జాతీయులకు ప్రయాణ పత్రాలు కోసం ఖతర్ అధికారులను భారత దౌత్య కార్యాలయం అభ్యర్దించగా, డిసెంబర్ 19 వ తేదీన రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ను జారీ చేసింది. అలాగే, 9 మంది భారతీయులకు విమాన టికెట్లను సైతం ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల