జైలు లో 90 మంది భారతీయులు మరో 193 మందికి దేశ బహిష్కరణ
- December 26, 2015
భారత దౌత్య కార్యాలయంలోని లేబర్ మరియు కమ్యునిటీ వెల్ఫేర్ విభాగం తమకు 4080 పిర్యాదులు అందినట్లు కమ్యునిటీ హౌస్ తెలిపింది. గత ఏడాది 3943 పిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. కేంద్ర కారాగారంలో90 మంది భారతీయులు జైలుశిక్ష అనుభవిస్తున్నారు. మరో 193 మంది దేశ బహిష్కరణ గురై స్వదేశంకు వెళ్ళడానికి టికెట్ల కోసం వేచియున్నట్లు తెలిపారు. అలాగే , ఖతర్ లో 2014 లో 279 మంది, 2015 లో ఇప్పటి వరుకు 275 మంది భారతీయులు మరణించినట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ లోపు 15 మంది చనిపోయినట్లు భారత దౌత్య కార్యాలయం వివరాలను అందిస్తుంది. బహిష్కరణ గురైన భారత జాతీయులకు ప్రయాణ పత్రాలు కోసం ఖతర్ అధికారులను భారత దౌత్య కార్యాలయం అభ్యర్దించగా, డిసెంబర్ 19 వ తేదీన రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ను జారీ చేసింది. అలాగే, 9 మంది భారతీయులకు విమాన టికెట్లను సైతం ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







