జైలు లో 90 మంది భారతీయులు మరో 193 మందికి దేశ బహిష్కరణ
- December 26, 2015
భారత దౌత్య కార్యాలయంలోని లేబర్ మరియు కమ్యునిటీ వెల్ఫేర్ విభాగం తమకు 4080 పిర్యాదులు అందినట్లు కమ్యునిటీ హౌస్ తెలిపింది. గత ఏడాది 3943 పిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. కేంద్ర కారాగారంలో90 మంది భారతీయులు జైలుశిక్ష అనుభవిస్తున్నారు. మరో 193 మంది దేశ బహిష్కరణ గురై స్వదేశంకు వెళ్ళడానికి టికెట్ల కోసం వేచియున్నట్లు తెలిపారు. అలాగే , ఖతర్ లో 2014 లో 279 మంది, 2015 లో ఇప్పటి వరుకు 275 మంది భారతీయులు మరణించినట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ లోపు 15 మంది చనిపోయినట్లు భారత దౌత్య కార్యాలయం వివరాలను అందిస్తుంది. బహిష్కరణ గురైన భారత జాతీయులకు ప్రయాణ పత్రాలు కోసం ఖతర్ అధికారులను భారత దౌత్య కార్యాలయం అభ్యర్దించగా, డిసెంబర్ 19 వ తేదీన రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ను జారీ చేసింది. అలాగే, 9 మంది భారతీయులకు విమాన టికెట్లను సైతం ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







