జైలు లో 90 మంది భారతీయులు మరో 193 మందికి దేశ బహిష్కరణ

- December 26, 2015 , by Maagulf
జైలు లో 90 మంది భారతీయులు మరో 193 మందికి దేశ బహిష్కరణ

 భారత దౌత్య కార్యాలయంలోని  లేబర్ మరియు కమ్యునిటీ వెల్ఫేర్ విభాగం తమకు 4080 పిర్యాదులు అందినట్లు కమ్యునిటీ హౌస్  తెలిపింది. గత ఏడాది 3943 పిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. కేంద్ర కారాగారంలో90 మంది  భారతీయులు జైలుశిక్ష అనుభవిస్తున్నారు. మరో 193 మంది  దేశ బహిష్కరణ  గురై స్వదేశంకు వెళ్ళడానికి టికెట్ల కోసం వేచియున్నట్లు తెలిపారు. అలాగే , ఖతర్ లో 2014 లో 279 మంది, 2015 లో ఇప్పటి వరుకు 275 మంది  భారతీయులు మరణించినట్లు సమాచారం. ఈ ఏడాది  డిసెంబర్ లోపు 15 మంది చనిపోయినట్లు భారత దౌత్య కార్యాలయం వివరాలను అందిస్తుంది.  బహిష్కరణ గురైన భారత జాతీయులకు ప్రయాణ పత్రాలు కోసం ఖతర్ అధికారులను భారత దౌత్య కార్యాలయం అభ్యర్దించగా, డిసెంబర్ 19 వ తేదీన రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ను జారీ చేసింది. అలాగే, 9 మంది భారతీయులకు  విమాన టికెట్లను సైతం ఏర్పాటు చేసింది. 

       
                  
              

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com