అమెరికా:తీవ్రమైన చలి.. 21 మంది మృతి
- February 02, 2019
అమెరికాలోని మధ్యపశ్చిమ ప్రాంతంలో ఏర్పడిన తీవ్రమైన చలికారణంగా ఇప్పటివరకు 21మంది మరణించారు. కోట్లాదిమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రోజు అత్యంల్పంగా మైనస్ 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో సాధారణ వాతావరణం ఏర్పడే వరకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
మంచుతోపాటు అర్కిటెక్ నుంచి చలిగాలులు వీస్తుండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని తెలిపారు. రోడ్లపక్కనుండే నిరాశ్రయుల పరిస్థితి దయనీయంగా మారడంతో వారికి ప్రత్యేకంగా వార్మింగ్ షెల్టర్స్ ఏర్పాటు చేశారు. పలుచోట్ల ప్రజలను ఇళ్లనుంచి వెచ్చటి కేంద్రాలకు తరలించి ఆశ్రయం కల్పిస్తున్నారు. మొత్తం 12 రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీస్థాయిలో పడిపోయాయని, మరికొన్ని రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







