అమెరికా:తీవ్రమైన చలి.. 21 మంది మృతి
- February 02, 2019అమెరికాలోని మధ్యపశ్చిమ ప్రాంతంలో ఏర్పడిన తీవ్రమైన చలికారణంగా ఇప్పటివరకు 21మంది మరణించారు. కోట్లాదిమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రోజు అత్యంల్పంగా మైనస్ 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో సాధారణ వాతావరణం ఏర్పడే వరకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
మంచుతోపాటు అర్కిటెక్ నుంచి చలిగాలులు వీస్తుండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని తెలిపారు. రోడ్లపక్కనుండే నిరాశ్రయుల పరిస్థితి దయనీయంగా మారడంతో వారికి ప్రత్యేకంగా వార్మింగ్ షెల్టర్స్ ఏర్పాటు చేశారు. పలుచోట్ల ప్రజలను ఇళ్లనుంచి వెచ్చటి కేంద్రాలకు తరలించి ఆశ్రయం కల్పిస్తున్నారు. మొత్తం 12 రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీస్థాయిలో పడిపోయాయని, మరికొన్ని రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్