అమెరికా:తీవ్రమైన చలి.. 21 మంది మృతి
- February 02, 2019
అమెరికాలోని మధ్యపశ్చిమ ప్రాంతంలో ఏర్పడిన తీవ్రమైన చలికారణంగా ఇప్పటివరకు 21మంది మరణించారు. కోట్లాదిమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రోజు అత్యంల్పంగా మైనస్ 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో సాధారణ వాతావరణం ఏర్పడే వరకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
మంచుతోపాటు అర్కిటెక్ నుంచి చలిగాలులు వీస్తుండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని తెలిపారు. రోడ్లపక్కనుండే నిరాశ్రయుల పరిస్థితి దయనీయంగా మారడంతో వారికి ప్రత్యేకంగా వార్మింగ్ షెల్టర్స్ ఏర్పాటు చేశారు. పలుచోట్ల ప్రజలను ఇళ్లనుంచి వెచ్చటి కేంద్రాలకు తరలించి ఆశ్రయం కల్పిస్తున్నారు. మొత్తం 12 రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీస్థాయిలో పడిపోయాయని, మరికొన్ని రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







