ఫోన్ స్కామ్ గ్యాంగ్ అరెస్ట్
- February 02, 2019
24 మంది సభ్యులు గల ఫోన్ స్కామ్ గ్యాంగ్ సభ్యుల్ని యూఏఈలో అరెస్ట్ చేశారు. అబుదాబీ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, అరెస్ట్ అయిన నిందితుల్ని ట్రయల్ కోర్ట్కి రిఫర్ చేయడం జరిగిందనీ, వారంతా ఆసియాకి చెందినవారనీ, ఫోన్ల ద్వారా బహుమతులంటూ పెద్దయెత్తున మోసాలకు వీరు పాల్పడుతున్నారని తెలుస్తోంది. బాధితుల నుంచి సొమ్ములు రాబట్టాక, నిందితులు ఫోన్లను మార్చేస్తుంటారనీ, ఈ క్రమంలో ఓ బాధితుడు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో నిందితుల్ని అత్యంత వ్యూహాత్మకంగా పట్టుకున్నామనీ అధికారులు వివరించారు. మొదట 17 మందిని అరెస్ట్ చేయగా, వారి నుంచి వచ్చిన సమాచారంతో మరో ఏడుగుర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







