యూఏఈ విచ్చేయనున్న పోప్..అసలెందుకింత ప్రాధాన్యం?
- February 03, 2019దుబాయ్: క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ నేడు చారిత్రక పర్యటనకు బయల్దేరారు. దుబాయ్లో జరగనున్న 'ఇంటర్ఫెయిత్ కాన్ఫరెన్స్'కు ఆయన హాజరు కానున్నారు. ఈ సదస్సుకు హాజరుకావాలని అబుదాబీ యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నెహ్యాన్ ఆయన్ను ఆహ్వానించారు. ఆయన ఇప్పటికే వాటికస్ సిటీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. మంగళవారం జరగనున్న ఈ సదస్సుకు దాదాపు లక్షా 20 వేల మంది హాజరవుతారని అంచనా. ''సోదరభావం, సహనశీలతలకు నిదర్శనంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ సంస్కృతులు కలిసే ప్రదేశం'' అని పోప్ దుబాయ్కు కితాబిచ్చారు. తన పర్యటనలో భాగంగా కైరోకు చెందిన అల్-అజ్మర్ మసీదు ఇమామ్తో కూడా భేటీ కానున్నారు.
ఎందుకింత ప్రధాన్యం..
యెమన్లో జరుగుతున్న యుద్ధాన్ని పోప్ ఇప్పటికే చాలా ఖండించారు. ఈ యుద్ధంలో భాగంగా సౌదీతోపాటు యూఏఈ కూడా యెమన్పై దాడులు నిర్వహిస్తోంది. గత ఏడాది పోప్ మాట్లాడుతూ యెమన్లో మానవీయత దిగజారకుండా కాపాడుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో పోప్ ఇక్కడికి రానుండటం విశేషం. యుఏఈలో దాదాపు 10 లక్షల మంది రోమన్ కేథలిక్లు ఉన్నారు. వీరిలో అత్యధిక మంది భారత్, ఫిలిప్పన్స్ నుంచి వచ్చినారే.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు