ఫేక్‌ ఎంబసీ కాల్స్‌ పట్ల అప్రమత్తం

- February 06, 2019 , by Maagulf
ఫేక్‌ ఎంబసీ కాల్స్‌ పట్ల అప్రమత్తం

పలు రకాలైన కాన్సులర్‌ సేవలు అందిస్తామంటూ బహ్రెయిన్‌లో బారత పౌరులకు కొన్ని ఫేక్స్‌ కాల్స్‌ వెళుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఎంబసీ, బహ్రెయిన్‌లో తమ పౌరుల్ని ఉద్దేశించి హెచ్చరిక సూచన చేసింది. కాన్సులర్‌ తరఫున ఎవరూ డబ్బులు కోరుతూ ఫోన్లు చేయరని, అలా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా అది ఫ్రాడ్‌ కిందకే వస్తుందనీ, ఫ్రాడ్‌ కాల్స్‌ పట్ల రెసిడెంట్స్‌ అప్రమత్తంగా వుండాలనీ, అవసరమైతే ఎంబసీకి సమాచారం ఇవ్వాలనీ ఎంబసీ అధికారులు సూచించారు. మరోపక్క స్థానిక అథారిటీస్‌కి ఎంబసీ ఈ ఫేక్‌ కాల్స్‌పై ఫిర్యాదు చేయడం జరిగింది. 'ఫోన్‌ స్పూఫింగ్‌' ద్వారా నిందితులు, రెసిడెంట్స్‌పై మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com