ఏటీఎం కార్డుల బ్లాక్: బ్యాంకుల హెచ్చరిక
- February 08, 2019యూఏఈలో బ్యాంకులు తమ వినియోగదారుల్ని ఎమిరేట్స్ ఐడీని రెన్యూ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. ఫిబ్రవరి 15 లోగా అప్డేట్ చేసుకోని పక్షంలో వారి ఏటీఎం కార్డులు తాత్కాలికంగా పనిచేయడం మానేస్తాయి. ఆటోమేటిక్ పేమెంట్లు, క్రెడిట్ కార్డులు సైతం ఆగిపోయే అవకాశాలుంటాయి. ఈ నిర్నయం యూఏఈలోని ఫైనాన్స్ కంపెనీలకూ వర్తిస్తాయి. అయితే బ్యాంక్ టెల్లర్ సర్వసులు, కస్టమర్ సర్వీస్ సెంటర్స్ మీద మాత్రం ఈ ప్రభావం వుండదు. ఈ సమయంలో ఎలాంటి అదనపు ఛార్జీలు, కండిషన్స్, జరీమానాలు వుండబోవు. క్లయింట్స్ బ్యాంకు వెబ్సైట్ని సందర్శించడం, బ్యాంక్కి ఐడీ ఫొటో కాపీని ఇ-మెయిల్ చేయడం, మొబైల్ బ్యాంకింగ్ వినియోగించడం, ఏటీఎం మెషీన్ల ద్వారా అప్డేట్ చేసుకోవడం, కస్టమర్ సర్వీస్ సెంటర్స్ని ఆశ్రయించడం ద్వారా తమ డిటెయిల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్