సౌదీలో 14వ ఔట్లెట్ ప్రారంభించిన మలబార్ గోల్డ్
- February 12, 2019మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, సౌదీ అరేబియాలో 14వ ఔట్లెట్ని ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాల్లో 250 ఔట్లెట్స్తో జ్యుయెలరీ రంగంలో అతి పెద్ద సంస్థగా ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకుంటోంది మలబార్ గోల్డ్. ఫిబ్రవరి 7న ఎంపిఅహ్మద్ (మలబార్ గోల్డ్ గ్రూప్ ఛైర్మన్) చేతుల మీదుగా ఈ 14వ షోరూం ప్రారంభమయ్యింది. మదినాలోని అల్ మునావరాలో అల్ మస్జిద్ గేట్ 17కి దగ్గరలో ఈ షోరూంని ఏర్పాటు చేశారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జెడ్డాలోనూ, అల్ బలాద్లోనూ ఫిబ్రవరి 6న రెండు షోరూంలను ప్రారంభించడం గమనార్హం. కొత్త ప్రారంభోత్సవాల నేపథ్యంలో ప్రారంభోత్సవ ఆఫర్లను సంస్థ ప్రకటించింది. 3,000 సౌదీ రియాల్స్తో కొనుగోలు జరిపేవారికి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ని ఉచితంగా అందిస్తున్నారు. అలాగే 22 క్యారెట్ గోల్డ్ జ్యుయెలరీకి సంబంధించి జీరో డిడక్షన్ ఎక్స్ఛేంజ్ పొందే వీలుంది. జెడ్డా అల్ బలాద్ స్టోర్స్ మదినా మునావరా స్టోర్స్లో ఫిబ్రవరి 23 వరకు ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం