సౌదీలో 14వ ఔట్లెట్ ప్రారంభించిన మలబార్ గోల్డ్
- February 12, 2019మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, సౌదీ అరేబియాలో 14వ ఔట్లెట్ని ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాల్లో 250 ఔట్లెట్స్తో జ్యుయెలరీ రంగంలో అతి పెద్ద సంస్థగా ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకుంటోంది మలబార్ గోల్డ్. ఫిబ్రవరి 7న ఎంపిఅహ్మద్ (మలబార్ గోల్డ్ గ్రూప్ ఛైర్మన్) చేతుల మీదుగా ఈ 14వ షోరూం ప్రారంభమయ్యింది. మదినాలోని అల్ మునావరాలో అల్ మస్జిద్ గేట్ 17కి దగ్గరలో ఈ షోరూంని ఏర్పాటు చేశారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జెడ్డాలోనూ, అల్ బలాద్లోనూ ఫిబ్రవరి 6న రెండు షోరూంలను ప్రారంభించడం గమనార్హం. కొత్త ప్రారంభోత్సవాల నేపథ్యంలో ప్రారంభోత్సవ ఆఫర్లను సంస్థ ప్రకటించింది. 3,000 సౌదీ రియాల్స్తో కొనుగోలు జరిపేవారికి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ని ఉచితంగా అందిస్తున్నారు. అలాగే 22 క్యారెట్ గోల్డ్ జ్యుయెలరీకి సంబంధించి జీరో డిడక్షన్ ఎక్స్ఛేంజ్ పొందే వీలుంది. జెడ్డా అల్ బలాద్ స్టోర్స్ మదినా మునావరా స్టోర్స్లో ఫిబ్రవరి 23 వరకు ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం