ఒక్కటవ్వనున్న ఆర్య, సాయేషా
- February 14, 2019చెన్నై: ప్రముఖ తమిళ నటుడు ఆర్య, సినీ నటి సాయేషా సైగల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రేమికుల రోజును పురస్కరించుకుని తాము ప్రేమించుకుంటున్న విషయం నిజమేనని ఆర్య ట్విటర్ వేదికగా ప్రకటించారు. సాయేషాతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 'మా తల్లిదండ్రులు, కుటుంబీకుల ఆశీస్సులతో మేమిద్దరం మార్చిలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాం. మా కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలని ఆశీర్వదించండి' అని పేర్కొంటూ అభిమానులకు వాలంటైన్స్ డే విషెస్ తెలిపారు.
ఆర్య, సాయేషా 'గజినీకాంత్' చిత్రంలో జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. అప్పటికే ఇరు వైపు కుటుంబాలు వీరి ప్రేమను ఒప్పుకొన్నట్లు వార్తలు వచ్చాయి. సాయేషా ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మనవరాలు. గతంలో ఆర్య 'ఎంగ వీటు మాప్పిళ్లై' పేరిట స్వయంవర కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇదే కార్యక్రమంలో తనకు నచ్చిన అమ్మాయిని ఎంచుకుని పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు. కానీ ఆ కార్యక్రమం వివాదాస్పదం కావడంతో ఆపేశారు.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!