మహిళల రక్షణకై భారత ప్రభుత్వ చర్యల్ని ఆహ్వానించిన యూఏఈలోని భారత మహిళలు
- February 14, 2019
భారత పార్లమెంటులో ఇటీవల కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ప్రవేశపెట్టిన ప్రపోజల్ బిల్లుపై యూఏఈ రెసిడెంట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రపోజల్ అమల్లోకి వస్తే, భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డ భారతీయులెవరైనా తమ భార్యలను పట్టించుకోకపోతే భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం ఇలాంటి వెసులుబాటు ఏదీ లేకపోవడంతో మహిళలు, తమ భర్తలు తమను వదిలేశాక తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. తాజా ప్రపోజల్ ప్రకారం విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయులు తమ పెళ్ళిని ఇండియాలో రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. ఆ సమయంలోనే వారి పాస్పోర్ట్ డిటెయిల్స్ తీసుకుంటారు. ఒకవేళ భార్యను భర్త వదిలేస్తే, ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లయితే వెంటనే భర్త తాలూకు ఆస్తుల్ని జప్తు చేయడం, పాస్పోర్ట్ని రద్దు చేయడం చేస్తారు. ఈ ప్రపోజల్ వల్ల చాలామందికి మేలు కలుగుతుందనీ, అక్రమార్కులకు చెక్ పెట్టవచ్చునని యూఏఈ రెసిడెంట్స్ అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
- వీసా ఫీజులను పెంచిన జపాన్ ..భారతీయుల పై పడనున్న భారం!
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!







