మహిళల రక్షణకై భారత ప్రభుత్వ చర్యల్ని ఆహ్వానించిన యూఏఈలోని భారత మహిళలు
- February 14, 2019
భారత పార్లమెంటులో ఇటీవల కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ప్రవేశపెట్టిన ప్రపోజల్ బిల్లుపై యూఏఈ రెసిడెంట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రపోజల్ అమల్లోకి వస్తే, భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డ భారతీయులెవరైనా తమ భార్యలను పట్టించుకోకపోతే భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం ఇలాంటి వెసులుబాటు ఏదీ లేకపోవడంతో మహిళలు, తమ భర్తలు తమను వదిలేశాక తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. తాజా ప్రపోజల్ ప్రకారం విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయులు తమ పెళ్ళిని ఇండియాలో రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. ఆ సమయంలోనే వారి పాస్పోర్ట్ డిటెయిల్స్ తీసుకుంటారు. ఒకవేళ భార్యను భర్త వదిలేస్తే, ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లయితే వెంటనే భర్త తాలూకు ఆస్తుల్ని జప్తు చేయడం, పాస్పోర్ట్ని రద్దు చేయడం చేస్తారు. ఈ ప్రపోజల్ వల్ల చాలామందికి మేలు కలుగుతుందనీ, అక్రమార్కులకు చెక్ పెట్టవచ్చునని యూఏఈ రెసిడెంట్స్ అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







