పాస్పోర్ట్ రెన్యువల్: కొత్త సర్వీస్ ప్రారంభం
- February 14, 2019షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద '24 హవర్ పాస్పోర్ట్ ఆఫీస్'ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలో యూఏఈ జాతీయులు తమ ఎక్స్పైర్డ్ పాస్పోర్టుల్ని నిమిషాల్లోనే రెన్యువల్ చేసుకోవడానికి వీలుంది. రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ సర్వీస్ని వినియోగించుకోవడానికి ఈ కార్యాలయం అవకాశం కల్పిస్తుంది. షార్జా డిప్యూటీ రూలర్, క్రౌన్ ప్రిన్స్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిడిఆర్ఎఫ్ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఆరిఫ్ అల్ షామ్షి మాట్లాడుతూ, యూఏఈ సిటిజన్స్ కోసం ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. కొత్త పాస్పోర్ట్ ఫొటో, రెన్యువల్ ఫీజు చెల్లిస్తే, నిమిషాల వ్యవధిలోనే పాస్పోర్ట్ రెన్యువల్ అవుతుందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పాస్పోర్ట్ ఆరు నెలల సమయం వరకు గడువు వుందో లేదో చూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ