పాస్పోర్ట్ రెన్యువల్: కొత్త సర్వీస్ ప్రారంభం
- February 14, 2019
షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద '24 హవర్ పాస్పోర్ట్ ఆఫీస్'ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలో యూఏఈ జాతీయులు తమ ఎక్స్పైర్డ్ పాస్పోర్టుల్ని నిమిషాల్లోనే రెన్యువల్ చేసుకోవడానికి వీలుంది. రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ సర్వీస్ని వినియోగించుకోవడానికి ఈ కార్యాలయం అవకాశం కల్పిస్తుంది. షార్జా డిప్యూటీ రూలర్, క్రౌన్ ప్రిన్స్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిడిఆర్ఎఫ్ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఆరిఫ్ అల్ షామ్షి మాట్లాడుతూ, యూఏఈ సిటిజన్స్ కోసం ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. కొత్త పాస్పోర్ట్ ఫొటో, రెన్యువల్ ఫీజు చెల్లిస్తే, నిమిషాల వ్యవధిలోనే పాస్పోర్ట్ రెన్యువల్ అవుతుందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పాస్పోర్ట్ ఆరు నెలల సమయం వరకు గడువు వుందో లేదో చూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







