పాస్పోర్ట్ రెన్యువల్: కొత్త సర్వీస్ ప్రారంభం
- February 14, 2019
షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద '24 హవర్ పాస్పోర్ట్ ఆఫీస్'ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలో యూఏఈ జాతీయులు తమ ఎక్స్పైర్డ్ పాస్పోర్టుల్ని నిమిషాల్లోనే రెన్యువల్ చేసుకోవడానికి వీలుంది. రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ సర్వీస్ని వినియోగించుకోవడానికి ఈ కార్యాలయం అవకాశం కల్పిస్తుంది. షార్జా డిప్యూటీ రూలర్, క్రౌన్ ప్రిన్స్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిడిఆర్ఎఫ్ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఆరిఫ్ అల్ షామ్షి మాట్లాడుతూ, యూఏఈ సిటిజన్స్ కోసం ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. కొత్త పాస్పోర్ట్ ఫొటో, రెన్యువల్ ఫీజు చెల్లిస్తే, నిమిషాల వ్యవధిలోనే పాస్పోర్ట్ రెన్యువల్ అవుతుందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పాస్పోర్ట్ ఆరు నెలల సమయం వరకు గడువు వుందో లేదో చూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







