వర్క్ ప్లేస్లో బలవన్మరణానికి పాల్పడ్డ వలసదారుడు
- February 14, 2019
భారతీయ వలసదారుడొకరు మాల్కియాలోని వర్క్ ప్లేస్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడ్ని 48 ఏళ్ళ రామ్ ప్రతాప్ సింగ్గా గుర్తించారు. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్లుగా అతని గురించిన వివరాల్ని అధికారులు పేర్కొన్నారు. మృతుడికి భార్య అనితా సింగ్, ముగ్గురు పిల్లలు వున్నారు. ఓ ప్రైవేటు కాంట్రాక్టింగ్ కంపెనీలో మృతుడు వర్క్ సూపర్ వైజర్గా పనిచేస్తున్నారు. ముహరాక్లో నివసిస్తున్న సింగ్ తన కుమార్తెల్ని ఇంటి వద్ద వదలి, రాత్రి సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. తన తండ్రి ఆచూకీ కోసం ఆయన కుమార్తెలు సాక్షి, శ్రేయ సింగ్ ప్రయత్నించగా, కో-వర్కర్, రామ్ ప్రతాప్ సింగ్ మృతి విషయాన్ని వెల్లడించారు. సాక్షి, శ్రేయ, ఇండియన్ స్కూల్ బహ్రెయిన్లో విద్యనభ్యసిస్తున్నారు. రామ్ ప్రతాప్ సింగ్ కుమారుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. భారతదేశంలో చికిత్స పొందుతున్న ఆ కుర్రాడికి సహాయంగా అతని తల్లి ఇండియాలోనే వుంది. ఈ క్రమంలో సింగ్ బలవన్మరణానికి పాల్పడటం బాధాకరం. చనిపోయే ముందు ప్రతాప్ సింగ్ తన కుమార్తెలకు 200 బహ్రెయినీ దినార్స్ ఇచ్చాడు.
తాజా వార్తలు
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!







