వర్క్ ప్లేస్లో బలవన్మరణానికి పాల్పడ్డ వలసదారుడు
- February 14, 2019
భారతీయ వలసదారుడొకరు మాల్కియాలోని వర్క్ ప్లేస్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడ్ని 48 ఏళ్ళ రామ్ ప్రతాప్ సింగ్గా గుర్తించారు. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్లుగా అతని గురించిన వివరాల్ని అధికారులు పేర్కొన్నారు. మృతుడికి భార్య అనితా సింగ్, ముగ్గురు పిల్లలు వున్నారు. ఓ ప్రైవేటు కాంట్రాక్టింగ్ కంపెనీలో మృతుడు వర్క్ సూపర్ వైజర్గా పనిచేస్తున్నారు. ముహరాక్లో నివసిస్తున్న సింగ్ తన కుమార్తెల్ని ఇంటి వద్ద వదలి, రాత్రి సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. తన తండ్రి ఆచూకీ కోసం ఆయన కుమార్తెలు సాక్షి, శ్రేయ సింగ్ ప్రయత్నించగా, కో-వర్కర్, రామ్ ప్రతాప్ సింగ్ మృతి విషయాన్ని వెల్లడించారు. సాక్షి, శ్రేయ, ఇండియన్ స్కూల్ బహ్రెయిన్లో విద్యనభ్యసిస్తున్నారు. రామ్ ప్రతాప్ సింగ్ కుమారుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. భారతదేశంలో చికిత్స పొందుతున్న ఆ కుర్రాడికి సహాయంగా అతని తల్లి ఇండియాలోనే వుంది. ఈ క్రమంలో సింగ్ బలవన్మరణానికి పాల్పడటం బాధాకరం. చనిపోయే ముందు ప్రతాప్ సింగ్ తన కుమార్తెలకు 200 బహ్రెయినీ దినార్స్ ఇచ్చాడు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







