సౌదీ రాజు సల్మాన్ పాకిస్తాన్ పర్యటన ఆలస్యం...
- February 16, 2019
సౌదీ అరేబియా: సౌదీ రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్థాన్ దేశ పర్యటన ఆలస్యం కానుంది. పాకిస్థాన్ దేశంలో రెండురోజుల పర్యటన కోసం సౌదీ రాజు సల్మాన్ ఈ నెల 16న ఇస్లామాబాద్ రావాల్సి ఉండగా, అర్థాంతరంగా ఒకరోజు వాయిదా పడింది. సౌదీ రాజు పాక్ పర్యటన ఒకరోజు ఎందుకు ఆలస్యమైందనే విషయం వెల్లడి కాలేదు. భారతదేశంలోని పుల్వామాలో ఉగ్రవాదులు చేసిన దాడి ఘటనను సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఖండించారు. ఈ దాడి ఘటనపై స్పందించిన రాజు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము భారతదేశానికి మద్ధతు ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులైన భారత జవాన్లు త్వరగా కోలుకోవాలని సౌదీ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







