మస్కట్ ఇండియన్ ఎంబసీ వద్ద ప్రత్యేక ప్రార్థనలు
- February 16, 2019
మస్కట్:ఒమన్లోని ఇండియన్ ఎంబసీ వద్ద ప్రత్యేక ప్రార్థనల్ని ఏర్పాటు చేస్తున్నారు. కాశ్మీర్లో తీవ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన 42 మంది జవాన్లకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పించనున్నారు. ఇండియన్ ఎంబసీ సీనియర్ అధికారి మాట్లాడుతూ, పుల్వామా టెర్రర్ ఎటాక్ మృతులకు శ్రద్ధాంజలి ఘటించేందుకోసం ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేశామనీ, ఆదివారం అంటే ఫిబ్రవరి 17న ఉదయం 11.30 నిమిషాలకు ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఎంబసీ ఆడిటోరియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు ఎంబసీ అధికారులు. కాగా, ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, ఈ తీవ్రవాద దాడిని ఖండిస్తూ భారత ప్రభుత్వానికి సంతాప ప్రకటన పంపిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







