తెలంగాణ:అమర జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
- February 22, 2019హైదరాబాద్ః తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. జవాన్ల ప్రాణాలు పోకుండా కేంద్రం పటిష్టమైన విధానం తీసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం ప్రకటించారు. అమరులైన ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జవాన్లకు నివాళి అనంతరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదించనున్నారు. శాసనసభ ప్రారంభం కంటే ముందు బడ్జెట్ పత్రాలను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు