భారతీయ కార్మికుడ్ని వరించిన అదృష్టం
- February 25, 2019భారతీయ కార్మికుడొకర్ని అదృష్టం వరించింది. తన మొబైల్ ఫోన్ని రెన్యూ చేసుకోవడంతో ఊహించని అదృష్టం ఆయన సొంతమయ్యింది. వివరాల్లోకి వెళితే బల్వీర్ సింగ్ అనే వ్యక్తి, తన మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ని రెన్యువల్ చేయించుకోగా, 570 ఎస్ స్పైడర్ కారు అతనికి బహుమతిగా లభించింది. తన జీవితంలో తానెప్పుడూ ఊహించనంత గొప్ప బహుమతి ఇప్పుడు తనకు లభించిందని ఆయన అంటున్నారు. ఎమిరేట్స్ ఇంటిగ్రేటెడ్ టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీ (ఈఐటిసి) డ్యు, యూఏఈ రిజిస్ట్రేషన్ పాలసీ నేపథ్యంలో ఈ బహుమతిని అతనికి అందజేసింది. గడువు తీరిన ఐడీ రిజిస్ట్రేషన్స్ని కొత్తగా రెన్యూ చేసుకుంటే, సర్వీస్ కటాఫ్ నుంచి వెసులుబాటు కల్పిస్తామని చెబుతూ, ఇందుకు జనవరి 31వ తేదీని డెడ్లైన్గా ప్రకటించారు. అలా రెన్యూ చేయించుకున్నవారిని బంపర్ డ్రాలో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. బల్వీర్కి శుభాకాంక్షలు తెలుపుతున్నామని సంస్థ డిప్యూటీ సీఈఓ ఫహాద్ అల్ హస్సావి చెప్పారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు