భారతీయ కార్మికుడ్ని వరించిన అదృష్టం
- February 25, 2019
భారతీయ కార్మికుడొకర్ని అదృష్టం వరించింది. తన మొబైల్ ఫోన్ని రెన్యూ చేసుకోవడంతో ఊహించని అదృష్టం ఆయన సొంతమయ్యింది. వివరాల్లోకి వెళితే బల్వీర్ సింగ్ అనే వ్యక్తి, తన మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ని రెన్యువల్ చేయించుకోగా, 570 ఎస్ స్పైడర్ కారు అతనికి బహుమతిగా లభించింది. తన జీవితంలో తానెప్పుడూ ఊహించనంత గొప్ప బహుమతి ఇప్పుడు తనకు లభించిందని ఆయన అంటున్నారు. ఎమిరేట్స్ ఇంటిగ్రేటెడ్ టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీ (ఈఐటిసి) డ్యు, యూఏఈ రిజిస్ట్రేషన్ పాలసీ నేపథ్యంలో ఈ బహుమతిని అతనికి అందజేసింది. గడువు తీరిన ఐడీ రిజిస్ట్రేషన్స్ని కొత్తగా రెన్యూ చేసుకుంటే, సర్వీస్ కటాఫ్ నుంచి వెసులుబాటు కల్పిస్తామని చెబుతూ, ఇందుకు జనవరి 31వ తేదీని డెడ్లైన్గా ప్రకటించారు. అలా రెన్యూ చేయించుకున్నవారిని బంపర్ డ్రాలో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. బల్వీర్కి శుభాకాంక్షలు తెలుపుతున్నామని సంస్థ డిప్యూటీ సీఈఓ ఫహాద్ అల్ హస్సావి చెప్పారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







