జబెల్‌ అల్‌ అక్ధర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు

- February 25, 2019 , by Maagulf
జబెల్‌ అల్‌ అక్ధర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు

మస్కట్‌: జబెల్‌ అల్‌ అక్దర్‌ రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి వాహనంపై అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీలంకన్‌ స్కూల్‌ మస్కట్‌ వర్గాలు ఈ ఘటనపై స్పందిస్తూ, మృతి చెందిన చిన్నారులు అఫాఫ్‌ మరియు నవాల్‌ అహ్మద్‌ జకీద్‌గా పేర్కొనడం జరిగింది. మూడో చిన్నారి ఫయిక్‌ అహ్మద్‌ మౌజామ్‌. అఫాఫ్‌ తండ్రి, ప్రమాద సమయంలో వాహనాన్ని నడుపుతున్నారు. ఈ ప్రమాదంలో అఫాఫ్‌ తల్లి కూడా రపాణాలు కోల్పోయింది. చిన్నారుల మృతి కారణంగా శ్రీలంకన్‌ స్కూల్‌, నిన్న సెలవు దినంగా పాటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com