దర్శకురాలు అనుమానాస్పద మృతి
- February 25, 2019కేరళకు చెందిన యువ దర్శకురాలు నయన సూర్యన్ అనుమానాస్సద స్థితిలో మృతి చెందారు. సినిమాలపై ఉన్న అసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన
ఆమె పలు చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. రెండేళ్ల క్రితం ‘క్రాస్వర్డ్’ అనే సినిమా ద్వారా మాలీవుడ్లో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు.సినిమాల్లోకి రాకముందు.
నయన నాటక రంగంలో పనిచేశారు. అలాగే పలు ప్రకటనలను కూడా రూపోందించారు.
కాగా ఆదివారం రాత్రి ఆమె తన ఫ్లాట్లో శవమై కనిపించారు. అమె మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం నయన తల్లి ఆమెకు ఫోన్ చేయగా ఎంతకు ఎత్తలేదు. దీంతో ఆమె ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆమె స్నేహితులకి ఫోన్ చేశారు. ఈ క్రమంలో వారు తిరువనంతపురులోని ఆమె ఫ్లాట్లోకి వెళ్లి చూడగా.. ఆమె విగితా జీవిగా పడివు్న్నారు. ఈ విషయంపై ఆమె స్నేహితురాలు మీడియాతో మాట్లాడారు. నయన గత కొంతకాలంగా డయాబెటిస్తో బాధ పడుతున్నట్లు తెలిపారు. అలాగే కొద్దిరోజుల క్రితం మృతి చెందిన డైరెక్టర్ లెనిన్ రాజేంద్రన్ ఆమెకు గురువు. అతని దగ్గర నయన దర్శకత్వ మెళకువలను నేర్చుకున్నారు. రాజేంద్రన్ ఆకస్మిక మృతి తట్టుకోలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్వక్తం అవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక అనంతరం నిజానిజాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్వాప్తులో ఉందని పూర్తి విచారణ తర్వాత మృతి గల కారణాలను వెల్లడిస్తామన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!