పైలట్ల పేర్లు ప్రకటిస్తాం: పాక్

- February 27, 2019 , by Maagulf
పైలట్ల పేర్లు ప్రకటిస్తాం: పాక్

భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చినట్లు ప్రకటించిన పాక్ వారికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌కు ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డీజీ ఆసీఫ్‌ గఫూర్‌ వెల్లడించారు. పాక్‌ యుద్ధవిమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. వీటిలో ఒక విమానాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కూల్చేయగా.. మరో విమానాన్ని కశ్మీర్‌లో కూల్చివేసినట్లు పేర్కొన్నారు. భారత వాయుసేనకు చెందిన ఒక పైలట్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు ఆయన వెల్లడించారు. వారికి సంబంధించిన వివరాల డాక్యుమెంట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని భారత వాయుసేన ధ్రువీకరించాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com