యుద్ధం వద్దు: యూఏఈలోని భారత్‌ - పాక్‌ వలసదారులు

- February 28, 2019 , by Maagulf
యుద్ధం వద్దు: యూఏఈలోని భారత్‌ - పాక్‌ వలసదారులు

యూఏఈలో నివసిస్తోన్న భారత్‌, పాక్‌ దేశాలకు చెందిన వలసదారులు ఇరు దేశాల మధ్యా యుద్ధం వద్దంటూ నినదిస్తున్నారు. పాకిస్తాన్‌కి చెందిన రోహన్‌ ముస్తఫా మాట్లాడుతూ, తనకు చాలామంది అభిమానులు ఇరుదేశాల్లోనూ వున్నారని, యుద్ధం వస్తే అందరికీ నష్టమేననీ, ఇరు దేశాలూ యుద్ధం కోరుకోకుడదని అన్నారు. రోహన్‌ ముస్తఫా, యూఏఈ తరఫున స్టార్‌ క్రికెటర్‌గా మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. కాగా, భారతదేశానికి చెందిన అఫ్సర్‌ ఖాన్‌, ఇరు దేశాల మధ్యా ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోయి, శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు. పాకిస్తాన్‌కి చెందిన మసూద్‌ అలి మాట్లాడుతూ, యుద్ధంలో విజేతలు ఎవరూ వుండరనీ, నష్టపోయినవారే ఇరుదేశాల్లోనూ వుంటారని చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com