అభినందన్ కు ఏమైనా జరిగితే ఖబర్దార్; పాకిస్తాన్ కు భారత్ వార్నింగ్
- February 28, 2019
పాక్ చెరలో ఉన్న ఐఏఎఫ్ పైలట్ అభిందన్ వెంటనే విడుదల చేయాలని భారత్ విదేశాంగశాఖ డిమాండ్ చేసింది. సరిహద్దుల ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో ఢిల్లీలోని పాక్ విదేశాంగశాఖ డిప్యూటీ కమిషనర్ హైదర్ షాకు ఎన్ఐఏ సమన్లు జారీ చేసింది. సమన్ల వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేఫథ్యంలో ఆయన ఐఏఎఫ్ అధికారుల సమక్షంలో హాజరయ్యారు.
హైదర్ షాకు నీలదీత
ఈ సందర్భంగా అభిందన్ పట్ల పాక్ వ్యవహరించిన తీరును భారత్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ నిబంధనలు వ్యతిరేకంగా గాయపడ్డ అభినందన్ పట్ల పాక్ దురుచుగా ప్రవర్తించడం పట్ల భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్ చెరలో ఉన్న అభినందన్ ను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా భారత్ కోరింది. అభిందన్ కు ఏమనైనా జరిగితే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చింది.
తమ పోరాటం ఉగ్రవాదులపైనే..
పాక్ ఉన్న ఉగ్ర క్యాంపుల గురించి పాక్ సమాచారం ఇచ్చామని పాక్ చర్యలు తీసుకోకపోవడం వల్లే తాము చర్యలు తీసుకుంటున్నామని భారత్ వివరణ ఇచ్చింది. తాము ఉగ్రవాదులపై దాడి చేశామే కానీ పాక్ ప్రజలపై కాదని భాతర్ విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి
- గెలిచిన 5 నెలల్లోపే సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్
- అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం
- మే 1 నుంచి టీటీడీలో కొత్త రూల్స్..!
- అన్ సేఫ్ టాయ్స్ పట్ల సీపీఏ హెచ్చరిక..!!









