శివుడు సృష్టి ఆదియోగి..యోగశాస్త్ర సృష్టికర్త
- March 05, 2019
ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడు కోయంబత్తూరులో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీంతో వెల్లంగిరి కొండలు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. ఈ వేడుకల్లో దేశ, విదేశాలకు చెందిన భక్తులు భారీగా పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి.
లయకారుడైన శివుడు సృష్టికే ఆదియోగి. ఆయన నుంచే యోగశాస్త్రం ఆవిర్భవించింది. దేశంలోని ప్రముఖ యోగ, ధ్యాన కేంద్రమైన ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఎప్పటిలా ఈసారి కూడా అత్యంత వైభవంగా, విలక్షణంగా నిర్వహించారు. భక్తిని, యోగ ధ్యానాలతో మిళితం చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించింది.
ఈశా ఫౌండేషన్ 1994 మార్చి నుంచి ప్రత్యేకంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. శూన్యంలో నుంచి పుట్టి శూన్యంలో విలీనమవ్వడమన్న ఆధ్యాత్మిక చింతనను మహా శివరాత్రి వేడుకల్లో ప్రధానంగా వివరించారు. ఈ ఏడాది సద్గురు జెగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!









