శివుడు సృష్టి ఆదియోగి..యోగశాస్త్ర సృష్టికర్త
- March 05, 2019
ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడు కోయంబత్తూరులో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీంతో వెల్లంగిరి కొండలు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. ఈ వేడుకల్లో దేశ, విదేశాలకు చెందిన భక్తులు భారీగా పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి.
లయకారుడైన శివుడు సృష్టికే ఆదియోగి. ఆయన నుంచే యోగశాస్త్రం ఆవిర్భవించింది. దేశంలోని ప్రముఖ యోగ, ధ్యాన కేంద్రమైన ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఎప్పటిలా ఈసారి కూడా అత్యంత వైభవంగా, విలక్షణంగా నిర్వహించారు. భక్తిని, యోగ ధ్యానాలతో మిళితం చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించింది.
ఈశా ఫౌండేషన్ 1994 మార్చి నుంచి ప్రత్యేకంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. శూన్యంలో నుంచి పుట్టి శూన్యంలో విలీనమవ్వడమన్న ఆధ్యాత్మిక చింతనను మహా శివరాత్రి వేడుకల్లో ప్రధానంగా వివరించారు. ఈ ఏడాది సద్గురు జెగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







