ఎస్పైర్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభం
- March 07, 2019
దోహా: మూడవ ఎడిషన్ ఎస్పైర్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. ఎస్పైర్ పార్క్ వద్ద ఏర్పాటయిన ఈ కార్యక్రమంలో 18 దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్కి అధికారిక స్పాన్సరర్గా వ్యవహరిస్తున్నట్లు ఓరెడూ ప్రకటించింది. వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా తిలకించేందుకు, కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. వచ్చినవారిలో మహిళలు, పిల్లలు కూడా ఎక్కువగా వున్నారు. 40,000 మంది విజిటర్స్, 500 మంది స్టూడెంట్స్ ఈ ఫెస్టివల్లో పాల్గొంటారని అంచనా. మొత్తం నాలుగు రోజులపాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. వివిధ రంగుల్లో, రకరకాల రూపాల్లో కైట్స్ (పతంగులు - గాలి పటాలు) ఆకాశంలో కనువిందు చేస్తోంటే పిల్లలూ పెద్దలూ వాటిని చూసి కేరింతలు కొడుతున్నారు. పుడ్ ట్రక్స్, పేరేడ్ మరియు ఎంటర్టైన్మెంట్, స్టూడెంట్ యాక్టివిటీస్, వర్క్ షాప్స్ వంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







