ఎస్పైర్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభం
- March 07, 2019
దోహా: మూడవ ఎడిషన్ ఎస్పైర్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. ఎస్పైర్ పార్క్ వద్ద ఏర్పాటయిన ఈ కార్యక్రమంలో 18 దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్కి అధికారిక స్పాన్సరర్గా వ్యవహరిస్తున్నట్లు ఓరెడూ ప్రకటించింది. వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా తిలకించేందుకు, కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. వచ్చినవారిలో మహిళలు, పిల్లలు కూడా ఎక్కువగా వున్నారు. 40,000 మంది విజిటర్స్, 500 మంది స్టూడెంట్స్ ఈ ఫెస్టివల్లో పాల్గొంటారని అంచనా. మొత్తం నాలుగు రోజులపాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. వివిధ రంగుల్లో, రకరకాల రూపాల్లో కైట్స్ (పతంగులు - గాలి పటాలు) ఆకాశంలో కనువిందు చేస్తోంటే పిల్లలూ పెద్దలూ వాటిని చూసి కేరింతలు కొడుతున్నారు. పుడ్ ట్రక్స్, పేరేడ్ మరియు ఎంటర్టైన్మెంట్, స్టూడెంట్ యాక్టివిటీస్, వర్క్ షాప్స్ వంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









