ఇండో-పాక్ టెన్షన్ పై పెదవి విప్పిన ముషారఫ్
- March 07, 2019
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ల మధ్య పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. తాజాగా ఆయన మాటలు భారత్ వాదనకు మరింత ఊతమిస్తున్నాయి. భారత్లో దాడులు జరిపేందుకు పాక్ నిఘా వర్గాలు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థని వినియోగించుకున్నట్లు చెప్పారు ముషారఫ్. ఓ పాక్ జర్నలిస్టుకు టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. 2003లో జైషే సంస్థ తనను రెండుసార్లు చంపడానికి యత్నించిందన్నారు. అధికారంలోవున్న సమయంలో మీరు.. జైషే సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా, నాటి పరిస్థితులు భిన్నమైనవి చెప్పుకొచ్చారు. ఆ విషయంలో తాను ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని మనసులోని మాట బయటపెట్టారు.
ప్రస్తుతం జైషేపై పాక్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతించారు ఆయన. ఉగ్రవాదులకు పాక్ కేరాఫ్గా మారిందని ప్రపంచ దేశాలు నమ్ముతున్నప్పటికీ, అలాంటిదేమీ లేదని పదేపదే బుకాయిస్తోంది ఇమ్రాన్ సర్కార్. పుల్వామా ఉగ్రదాడి కూడా జైషేనే చేసిందని భారత్ ఆధారాలతో బయటపెట్టింది. అవేమీ ఇమ్రాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై పాక్ ప్రభుత్వం ఏమంటుందో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









