ఇండో-పాక్ టెన్షన్ పై పెదవి విప్పిన ముషారఫ్
- March 07, 2019
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ల మధ్య పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. తాజాగా ఆయన మాటలు భారత్ వాదనకు మరింత ఊతమిస్తున్నాయి. భారత్లో దాడులు జరిపేందుకు పాక్ నిఘా వర్గాలు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థని వినియోగించుకున్నట్లు చెప్పారు ముషారఫ్. ఓ పాక్ జర్నలిస్టుకు టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. 2003లో జైషే సంస్థ తనను రెండుసార్లు చంపడానికి యత్నించిందన్నారు. అధికారంలోవున్న సమయంలో మీరు.. జైషే సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా, నాటి పరిస్థితులు భిన్నమైనవి చెప్పుకొచ్చారు. ఆ విషయంలో తాను ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని మనసులోని మాట బయటపెట్టారు.
ప్రస్తుతం జైషేపై పాక్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతించారు ఆయన. ఉగ్రవాదులకు పాక్ కేరాఫ్గా మారిందని ప్రపంచ దేశాలు నమ్ముతున్నప్పటికీ, అలాంటిదేమీ లేదని పదేపదే బుకాయిస్తోంది ఇమ్రాన్ సర్కార్. పుల్వామా ఉగ్రదాడి కూడా జైషేనే చేసిందని భారత్ ఆధారాలతో బయటపెట్టింది. అవేమీ ఇమ్రాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై పాక్ ప్రభుత్వం ఏమంటుందో చూడాలి.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







