పాకిస్తాన్ ప్రధానితో సౌదీ మంత్రి భేటీ
- March 08, 2019ఇస్లామాబాద్:భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. సౌదీ అరేబియాకు చెందిన అత్యున్నత రాయబారి ఒకరు పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్తో గురువారం భేటీ అయ్యారని, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పంపిన ప్రత్యేక సందేశాన్ని ప్రధానికి చేరవేశారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ మేరకు సౌదీ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అడెల్ అల్ జుబేర్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్తో ఆయన నివాసంలో సమావేశమైనట్లు జియో టీవీ వెల్లడించింది. ఇరువురి మధ్య.. ప్రస్తుతం భారత్-పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చాయని వివరించింది. ఈ సందర్భంగా యువరాజు పంపిన ప్రత్యేక సందేశాన్ని జుబేర్ ప్రధానికి చేరవేశారని పేర్కొంది. ఈ సమావేశంలో పాకిస్థాన్ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ, ప్రధానమంత్రి వాణిజ్య సలహాదారు, విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు సమాచారం. భారత్తో ఉద్రిక్తతలను శాంతియుత మార్గంలో తగ్గించేందుకు తమ దేశం సహకరిస్తుందని జుబేర్ ఈ సందర్భంగా ఖురేషీకి హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం