40 కిలోల డ్రగ్స్తో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు
- March 09, 2019అబుదాబీ పోలీసులు 40 కిలోల క్రిస్టల్ మెత్ని పార్క్ చేసి వున్న పాత కారులో గుర్తించారు. ముసఫ్ఫా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసినవారిలో ఒకర్ని 'ది స్కార్పియన్'గా గుర్తించారు. డ్రగ్ కంట్రోల్ సెక్షన్ డైరెక్టరేట్ హెడ్ కల్నల్ తాహెర్ ఘరీబ్ అల్ దహ్రి మాట్లాడుతూ, విశ్వసనీయ వర్గాల సమాచారంతో సోదాలు నిర్వహించగా, నిందితులు వారితోపాటు డ్రగ్స్ స్వాధీనం చేసుకోగలిగామని చెప్పారు. క్రిస్టల్ మెత్ని పెద్ద మొత్తంలో తీసుకు వచ్చి, దాన్ని చిన్న చిన్న ప్యాక్టెలలో నింపి సరఫరా చేస్తుంటారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం