40 కిలోల డ్రగ్స్తో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు
- March 09, 2019
అబుదాబీ పోలీసులు 40 కిలోల క్రిస్టల్ మెత్ని పార్క్ చేసి వున్న పాత కారులో గుర్తించారు. ముసఫ్ఫా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసినవారిలో ఒకర్ని 'ది స్కార్పియన్'గా గుర్తించారు. డ్రగ్ కంట్రోల్ సెక్షన్ డైరెక్టరేట్ హెడ్ కల్నల్ తాహెర్ ఘరీబ్ అల్ దహ్రి మాట్లాడుతూ, విశ్వసనీయ వర్గాల సమాచారంతో సోదాలు నిర్వహించగా, నిందితులు వారితోపాటు డ్రగ్స్ స్వాధీనం చేసుకోగలిగామని చెప్పారు. క్రిస్టల్ మెత్ని పెద్ద మొత్తంలో తీసుకు వచ్చి, దాన్ని చిన్న చిన్న ప్యాక్టెలలో నింపి సరఫరా చేస్తుంటారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







