బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తాం:రాహుల్
- March 09, 2019
తెలంగాణ:తాము అధికారంలో రాగానే ప్రతి పేదలకు కనీస ఆదాయం వచ్చేలా పథకం అమలు చేస్తామన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ నీరవ్ మోదీ లాంటి వారి అకౌంట్లో డబ్బులు వేస్తే…తాము పేదల బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని అన్నారాయన. దేశంలోని ఏ ఒక్క పేదవాడిని వదలకుండా కనీసం ఆదాయం వచ్చేలా పథకం రూపొందిస్తామన్నారు. శంషాబాద్ లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న రాహుల్..తమ పార్టీ పేదల కోసం పోరాడుతుందని అన్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీతో దేశ ఆర్ధిక వ్యవస్థ పతనమై పోయిందన్నారు రాహుల్ గాంధీ. తాము అధికారంలోకి రాగానే జీఎస్టీని ఒకే శ్లాబులో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక నిరుద్యోగులు, చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు బ్యాంకు లోన్లు ఇప్పిస్తామన్నారు. రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మోడీ చేతిలో రిమోట్ లా మారారని ఆరోపించారు రాహుల్ గాంధీ. చైనా సైన్యం డోక్లాం సరిహద్దు దాటితే..మోదీ చైనా అధ్యక్షుడితో ఊయ్యాల ఊగారని గుర్తు చేశారు. పుల్వామా దాడి సమయంలో సినిమా తీయించుకుంటున్నారని విమర్శించారు. మోదీది దొంగదేశభక్తి అంటూ ఫైర్ అయ్యారు రాహుల్. దేశసంపదను 15 మందికి దోచి పెట్టారని ఆరోపించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..