బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తాం:రాహుల్
- March 09, 2019
తెలంగాణ:తాము అధికారంలో రాగానే ప్రతి పేదలకు కనీస ఆదాయం వచ్చేలా పథకం అమలు చేస్తామన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ నీరవ్ మోదీ లాంటి వారి అకౌంట్లో డబ్బులు వేస్తే…తాము పేదల బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని అన్నారాయన. దేశంలోని ఏ ఒక్క పేదవాడిని వదలకుండా కనీసం ఆదాయం వచ్చేలా పథకం రూపొందిస్తామన్నారు. శంషాబాద్ లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న రాహుల్..తమ పార్టీ పేదల కోసం పోరాడుతుందని అన్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీతో దేశ ఆర్ధిక వ్యవస్థ పతనమై పోయిందన్నారు రాహుల్ గాంధీ. తాము అధికారంలోకి రాగానే జీఎస్టీని ఒకే శ్లాబులో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక నిరుద్యోగులు, చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు బ్యాంకు లోన్లు ఇప్పిస్తామన్నారు. రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మోడీ చేతిలో రిమోట్ లా మారారని ఆరోపించారు రాహుల్ గాంధీ. చైనా సైన్యం డోక్లాం సరిహద్దు దాటితే..మోదీ చైనా అధ్యక్షుడితో ఊయ్యాల ఊగారని గుర్తు చేశారు. పుల్వామా దాడి సమయంలో సినిమా తీయించుకుంటున్నారని విమర్శించారు. మోదీది దొంగదేశభక్తి అంటూ ఫైర్ అయ్యారు రాహుల్. దేశసంపదను 15 మందికి దోచి పెట్టారని ఆరోపించారు.
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







