'మా' ఎన్నికల్లో నరేశ్ ప్యానల్ అద్భుత విజయం
- March 11, 2019హైదరాబాద్:ఉత్కంఠభరితంగా సాగిన తెలుగు సినీ నటుల సంఘం మా ఎన్నికల్లో నరేశ్ ప్యానల్ అద్భుత విజయం సాధించింది. అధ్యక్షుడిగా నరేశ్, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్, జాయింట్ సెక్రటరీ గౌతమ్ రాజు, శివ బాలాజీ, కోశాధికారిగా రాజీవ్ కనకాల గెలుపొందారు. హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందడం విశేషం.
మా ఎన్నికల్లో నరేశ్, శివాజీ రాజా ప్యానళ్ల మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. మాలో మొత్తం 745 ఓట్లు ఉండగా, 472 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నికలకు ఈవీఎంలను ఉపయోగించగా, ఈసారి బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు