భారీ సెక్స్ రాకెట్ .. విద్యార్థినులే టార్గెట్ ..
- March 12, 2019
తమిళనాడులో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ భారీ సెక్స్ రాకెట్ ముఠా ఆగడాలను అరికట్టారు పోలీసులు. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకొనే 20 ఏళ్ల లోపు అమ్మాయిలకు ఉచ్చు బిగించి, వారితో లైంగిక సంబంధాలు పెట్టుకొని, వీడియోలు తీసి వ్యాపారం చేసుకొంటున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా 200 మందికి పైగా అమ్మాయిలను మోసగించినట్లు తెలుస్తోంది.
బాధితులంతా కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి పరిసర ప్రాంతాలకు చెందినవారని పోలీసులు చెప్పారు. ఈ రాకెట్ను నడిపించిన ముఠాలోని ఒకరు అధికార పార్టీకి చెందిన ఓ యువనేత కావడం రాజకీయాల్లో కలకలం రేపింది. ఫేస్బుక్లో అమ్మాయిలతో పరిచయం ఏర్పరచుకోవడం, ఆపై ప్రేమిస్తున్నానంటూ వారి నగ్న దృశ్యాలను వీడియోలు తీసి బెదిరించి అత్యాచారం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా వీడియోలను కుటుంబీకులకు చూపుతామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.
బాధితులు బయటికొచ్చి ఫిర్యాదు చేయకపోవడంతో ఏడేళ్లుగా ఈ రాకెట్ యథేచ్ఛగా సాగినట్లు పోలీసులు తేల్చారు. ఓ విద్యార్థిని ధైర్యంగా ముందుకొచ్చి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పొల్లాచ్చికి చెందిన శబరిరాజన్, తిరునావుక్కరసు, సతీశ్, వసంతకుమార్ అనే కీచకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలు గుర్తించారు. వాటి ఆధారంగా 200 మందికిపైగానే బాధితులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితుల వద్ద ఉన్న సెల్ ఫోన్లలో వెయ్యికిపైగా అసభ్యకర వీడియోలు గుర్తించారు పోలీసులు.
ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే సోదరుడిని చంపేస్తామంటూ బాధితురాలిని కొందరు బెదిరించారని.. ఈ వ్యవహారంలో సెంథిల్, బాబు, నాగరాజ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. అయితే.. నాగరాజ్ అన్నాడీఎంకే పొల్లాచ్చి శాఖ యువ నాయకుడు. అధికార పార్టీ అండ ఉండటంతో ఈ ముఠా చెలరేగిపోయింది. అరెస్టు అయిన ఒకట్రెండు రోజుల్లోనే నాగరాజ్ బెయిల్పై బయటకు రావడం కలకలం రేపింది. పొల్లాచ్చి సంఘటనతో సంబంధం ఉన్న నాగరాజ్ను పార్టీ నుండి తొలగిస్తున్నట్లు అన్నాడీఎంకే అధిష్ఠానం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









