ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేసిన పవన్కళ్యాణ్
- March 14, 2019జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది… 32మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేశారు పవన్కళ్యాణ్… అలాగే నలుగురు పార్లమెంట్ అభ్యర్థులను కూడా ఖరారు చేశారు… ఇవాళ రాజమండ్రిలో ఆవిర్భావ సభ నిర్వహిస్తుండగా తొలి జాబితా విడుదల చేయడం గమనార్హం… మరోవైపు జనసేన, వామపక్షాల మధ్య పొత్తు చర్చలు ఈ నెల 16న కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి…
ఏపీలో అభ్యర్థుల జాబితా విడుదలలో మొదట నిలిచింది జనసేన పార్టీ… మొత్తం 32 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం అర్థరాత్రి దాటాక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు… అసెంబ్లీ అభ్యర్థులతోపాటు నలుగురు పార్లమెంట్ సభ్యులను కూడా ఖరారు చేశారు…..
ముందే ప్రకటించినట్టుగా రాజమండ్రి నుంచి ఆకుల సత్య నారాయణ, అమలాపురం నుంచి డీఎంఆర్ శేఖర్ ఎంపీగా పోటీ చేయనున్నారు. విశాఖ నుంచి గేదెల శ్రీనుబాబు, అనకాపల్లి నుంచి చింతల పార్ధసారథి ఎంపీలుగా పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. ఇక ఎమ్మెల్యేల జాబితా విషయానికి వస్తే.. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, గుంటూరు వెస్ట్ నుంచి తోట చంద్రశేఖర్, మమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణల పేర్లను పవన్ ఇంతకు ముందే ప్రకటించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు