హైదరాబాద్: ఫిలింనగర్ శ్రీవారి ఆలయంలో మహాకుంభాభిషేకం
- March 14, 2019
హైదరాబాద్:జూబ్లీహిల్స్లో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం 6 నుండి 7.30కు మీన లగ్నంలో మహాకుంభాభిషేకం జరిగింది. ఆ తరువాత భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ రూ.28 కోట్లతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టామని తెలిపారు. మార్చి 8వ తేదీన అంకురార్పణతో ప్రారంభించి ఐదు రోజుల పాటు ఋత్వికులు వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. ఆలయంలో ఇంజినీరింగ్ అధికారులు చక్కటి ఏర్పాట్లు చేశారని, ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టారని, ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలు అందించిందని వివరించారు. ఐదు ఎకరాల స్థలం ఉచితంగా ఇస్తే శ్రీవారి ఆలయం నిర్మిస్తామని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు ఈవో తెలిపారు.
ఈ కుంభాభిషేకం కార్యక్రంలో టి.టి.డి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ,తిరుమల జె.ఈ.వో కె.యస్ శ్రీనివాస రాజు ,తిరుపతి జె.ఈ.వో లక్ష్మీకాంతం,సీవీఎస్వో గోపినాథ్ జెట్టి ,ఆలయ ఓఎస్డి పాలశేషాద్రి,బొక్కసం ఇంచార్జి గురు రాజారావు,ధర్మకర్తల మండలి సభ్యులు రుద్రరాజు పద్మరాజు ,రమేష్ బాబు ,ప్రత్యేక ఆహ్వానితులు రాఘవేంద్రరావు,స్థానిక సలహామండలి సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!