పాక్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డ జూనియర్ భుట్టో
- March 14, 2019ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో విరుచుకుపడ్డారు. పాక్ను ప్రపంచానికి శత్రుదేశంగా మార్చేశారని ఆరోపించారు. ఇండియా-పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితులపైనా ఆయన మాట్లాడారు. ఉగ్ర సంస్థలకు పాక్లో స్థానం ఉండబోదని ఇమ్రాన్ అన్న వ్యాఖ్యలపై స్పందించారు.
' పాకిస్థాన్తో క్రమంగా అన్ని దేశాలు సంబంధాలు తెంచుకుంటున్నాయి. ప్రధాని ఇమ్రాన్ తీసుకుంటున్న చర్యల వల్లే ఇదంతా. ఉగ్రవాద నియంత్రణకు చర్యలు తీసుకుంటుంటే ప్రపంచ దేశాలు పాక్పై ఎందుకు మండిపడుతున్నాయి? ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులకు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి.ఇండియా-పాక్ మధ్య ఎప్పటి నుంచో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువయ్యాయి? మీరు(ఇమ్రాన్) నిజంగా శాంతిని కోరుకుంటుంటే ముందు ప్రపంచ దేశాల ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఉగ్రవాద నియంత్రణ పట్ల నిజాయతీగా ఉన్నట్లయితే మేం చెప్పే మూడు విషయాలను తీవ్రంగా తీసుకోండి. 'పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కమిటీని నియమించండి', 'నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతివ్వడం ఆపేయండి. లేదా వారికి దూరంగా ఉండండి', ' మీ మంత్రి వర్గంలో ఉండి నిషేధిత సంస్థలతో బంధాలు కొనసాగిస్తున్న వారిపై విచారణ జరిపి వారిని తొలగించండి'.. ఈ మూడు చర్యలు ప్రభుత్వం తీసుకుంటే ఉగ్రవాద నియంత్రణకు పాక్ ప్రభుత్వం కృషి చేస్తుందని మాతో పాటు అందరూ నమ్ముతారు' అని భుట్టో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు