న్యూజిలాండ్ టెర్రర్ ఎటాక్ని ఖండించిన ఒమన్
- March 16, 2019
మస్కట్: న్యూజిలాండ్లో జరిగిన తీవ్రవాద ఘటనను ఒమన్ తీవ్రంగా ఖండించింది. న్యూజిలాండ్లోగల క్రైస్ట్ చర్చ్లో రెండు మాస్క్లపై దుండుగులు దాడి చేసి, 49 మందికి పైగా ప్రాణాల్ని బలిగొన్న సంగతి తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కాగా, సుల్తానేట్ ఈ ఘటనను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ నుంచి ఈ ప్రకటన విడుదలైంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన ఒమన్, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని తుదముట్టించాల్సిందేనని ఒమన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ









