నకిలీ వీసాలను అమాయకులకు అంటగడుతున్న కంత్రీగాళ్లు
- March 21, 2019
హైదరాబాద్: ఉపాధి అవకాశాల పేరుతో నకిలీ వీసాలు, పాస్ పోర్టులను అమాయకులకు అంటగడుతున్న కంత్రీగాళ్లు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. 18 మంది ఏజెంట్లను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులంతా ఏపీ, తెలంగాణకు చెందినవారిగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో ఓ మహిళ కూడా ఉంది.
పోలీసులకు పట్టుబడిన వారిలో గల్ఫ్ ఎయిర్లైన్స్, ఒమన్ ఎయిర్ లైన్స్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈముఠాకు సహకరించిన చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న మధుని కూడా అరెస్ట్ చేశారు. ఎంప్లాయి మెంట్, టూరిస్ట్ వీసాలను సృష్టించి మానవ అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్… ఈగ్యాంగ్ సహాయంతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు సజ్జనార్. రూల్స్ పాటిస్తున్న ఏజంట్లను మాత్రమే నమ్మాలని.. మాయమాటలకు మోసపోవద్దని సీపీ సజ్జనార్ సూచించారు.
తోట మణికంఠ గ్యాంగ్ , పుష్ప గ్యాంగ్ రెండు ముఠాలు గా గత కొంత కాలంగా అక్రమ రవాణా చేస్తున్నారు. నకిలీ వీసా, పాస్ పోర్టులను సృష్టించి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు ముఠా సభ్యులు. గడిచిన 15 రోజుల వ్యవధిలోనే శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు 50మందికి పైగా నకిలీ వీసాలతో దుబాయ్ వెళ్తూ పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు పక్కా సమాచారంతో రంగంలోకి దిగి ఏజెంట్ల ఆట కట్టించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..