ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం
- March 22, 2019
హైదరాబాద్: ఐపీఎల్ ఫీవర్ క్రికెట్ అభిమానులను ఊపేస్తోంది. టిక్కెట్ల అమ్మకాలు కూడా ఉపందుకున్నాయి. ఆన్లైన్ వెబ్సైట్ www.eventsnow.com ద్వారా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ల టిక్కెట్లు కొనుగోలు చేయడానికి అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈనెల 29న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో సన్రైజర్స్ ఆడే తొలి మ్యాచ్ టిక్కెట్లలో ఒక్క రూ.1,562ల శ్రేణివి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రూ.500, రూ.781, రూ.1,953 టిక్కెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. ఉప్పల్లోనే ఈనెల 31న బెంగళూరు రాయల్ చాలెంజర్స్తో జరిగే మ్యాచ్ టిక్కెట్లలో రూ.1,171, రూ.3,125, రూ.5,468 శ్రేణివి అందుబాటులో ఉండగా రూ.500, రూ.781, రూ.1,367 టిక్కెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. ఇక, హైదరాబాద్లో ఎనిమిది టిక్కెట్ విక్రయ కేంద్రాలతో పాటు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు అసలైన టిక్కెట్లు పొందేందుకు నాలుగు ప్రత్యేక అవుట్లెట్స్ను ఏర్పాటు చేశారు. జింఖానా గ్రౌండ్స్, అసెంబ్లీ మెట్రో స్టేషన్, సరూర్నగర్ స్టేడియం, గచ్చిబౌలి బీడబ్స్లో టిక్కెట్ల విక్రయ కేంద్రాలతో పాటు రిడెంప్షన్ అవుట్లెట్స్ను ఏర్పాటు చేయగా మియాపూర్, మూసాపేట్, నాగోల్, బేగంపేట మెట్రో స్టేషన్లలో విక్రయ కేంద్రాలను ప్రారంభించారు.
తాజా వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్
- టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- సబ్ కాంట్రాక్టర్కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- తెలంగాణ డీజీపీ ఫొటోతో జనాలకు సైబర్ నేరగాళ్ల వల
- కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు