మేడమ్ టుస్సాడ్స్ మహేష్ బాబు మైనపు విగ్రహం
- March 25, 2019
సింగపూర్కు చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు తయారు చేసిన మహేష్ బాబు మైనపు విగ్రహ ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్లోని ఎఎంబి థియేటర్లో గ్రాండ్గా జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు, అభిమానుల ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ జరిగింది. గచ్చిబౌలిలోని ఎఎంబి సినిమాస్లో కొలువుదీరిన ఈ విగ్రహం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. బ్లాక్ సూట్లో ఉన్న మహేష్ మైనపు విగ్రహం ఆకట్టుకుంటోంది. అభిమానుల కోసమే ఈ విగ్రహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు వాక్స్ స్టాచ్యూ
విగ్రహా విష్కరణ అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ... ఇది అద్భుతంగా ఉందని, అమేజింగ్ లుక్ అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో అభిమానుల సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరుగడం ఆనందంగా ఉందన్నారు.
ఒక రోజు పాటు అభిమానుల సందర్శనార్థం
ఈ రోజు (మార్చి 25) మొత్తం కూడా ఈ విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం ఎఎంబి సినిమా థియేటర్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ రోజు రాత్రి దీన్ని సింగపూర్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
సింగపూర్ బయట ఇదే తొలిసారి
సింగర్పూర్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు... సింగపూర్ బయట ఒక సెలబ్రిటీ వాక్స్ స్టాచ్యూను ఆవిష్కరించడం ఇదే తొలిసారి. మహేష్ బాబు సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటంతో ఈ విగ్రహాన్ని స్వయంగా ఇక్కడకు తీసుకొచ్చి ఆవిష్కరించారు.
గౌరవంగా భావిస్తున్నాను
నా సొంత నగరంలో... నా అభిమానులు, కుటుంబం సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరుగడం ఆనందంగా ఉంది అంటూ మహేష్ బు వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..