మేడమ్ టుస్సాడ్స్ మహేష్ బాబు మైనపు విగ్రహం
- March 25, 2019
సింగపూర్కు చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు తయారు చేసిన మహేష్ బాబు మైనపు విగ్రహ ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్లోని ఎఎంబి థియేటర్లో గ్రాండ్గా జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు, అభిమానుల ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ జరిగింది. గచ్చిబౌలిలోని ఎఎంబి సినిమాస్లో కొలువుదీరిన ఈ విగ్రహం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. బ్లాక్ సూట్లో ఉన్న మహేష్ మైనపు విగ్రహం ఆకట్టుకుంటోంది. అభిమానుల కోసమే ఈ విగ్రహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు వాక్స్ స్టాచ్యూ
విగ్రహా విష్కరణ అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ... ఇది అద్భుతంగా ఉందని, అమేజింగ్ లుక్ అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో అభిమానుల సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరుగడం ఆనందంగా ఉందన్నారు.
ఒక రోజు పాటు అభిమానుల సందర్శనార్థం
ఈ రోజు (మార్చి 25) మొత్తం కూడా ఈ విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం ఎఎంబి సినిమా థియేటర్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ రోజు రాత్రి దీన్ని సింగపూర్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
సింగపూర్ బయట ఇదే తొలిసారి
సింగర్పూర్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు... సింగపూర్ బయట ఒక సెలబ్రిటీ వాక్స్ స్టాచ్యూను ఆవిష్కరించడం ఇదే తొలిసారి. మహేష్ బాబు సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటంతో ఈ విగ్రహాన్ని స్వయంగా ఇక్కడకు తీసుకొచ్చి ఆవిష్కరించారు.
గౌరవంగా భావిస్తున్నాను
నా సొంత నగరంలో... నా అభిమానులు, కుటుంబం సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరుగడం ఆనందంగా ఉంది అంటూ మహేష్ బు వెల్లడించారు.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!









