మేడమ్ టుస్సాడ్స్ మహేష్ బాబు మైనపు విగ్రహం
- March 25, 2019సింగపూర్కు చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు తయారు చేసిన మహేష్ బాబు మైనపు విగ్రహ ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్లోని ఎఎంబి థియేటర్లో గ్రాండ్గా జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు, అభిమానుల ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ జరిగింది. గచ్చిబౌలిలోని ఎఎంబి సినిమాస్లో కొలువుదీరిన ఈ విగ్రహం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. బ్లాక్ సూట్లో ఉన్న మహేష్ మైనపు విగ్రహం ఆకట్టుకుంటోంది. అభిమానుల కోసమే ఈ విగ్రహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు వాక్స్ స్టాచ్యూ
విగ్రహా విష్కరణ అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ... ఇది అద్భుతంగా ఉందని, అమేజింగ్ లుక్ అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో అభిమానుల సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరుగడం ఆనందంగా ఉందన్నారు.
ఒక రోజు పాటు అభిమానుల సందర్శనార్థం
ఈ రోజు (మార్చి 25) మొత్తం కూడా ఈ విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం ఎఎంబి సినిమా థియేటర్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ రోజు రాత్రి దీన్ని సింగపూర్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
సింగపూర్ బయట ఇదే తొలిసారి
సింగర్పూర్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు... సింగపూర్ బయట ఒక సెలబ్రిటీ వాక్స్ స్టాచ్యూను ఆవిష్కరించడం ఇదే తొలిసారి. మహేష్ బాబు సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటంతో ఈ విగ్రహాన్ని స్వయంగా ఇక్కడకు తీసుకొచ్చి ఆవిష్కరించారు.
గౌరవంగా భావిస్తున్నాను
నా సొంత నగరంలో... నా అభిమానులు, కుటుంబం సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరుగడం ఆనందంగా ఉంది అంటూ మహేష్ బు వెల్లడించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు