గాయపడ్డ ఫుట్బాల్ ఆటగాడ్ని పరామర్శించిన మొహమ్మద్
- March 25, 2019
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతోన్న ఫుట్ బాల్ ఆటగాడ్ని పరామర్శించారు. ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా మైదానంలోనే వున్న ఓ బిగ్ పోల్ని ఢీకొని అల్ జజీరా ఆటగాడు అహ్మద్ రబీ తీవ్రంగా గాయపడ్డారు. దుబాయ్లోని రషీద్ ఆసుపత్రిలో అతనికి వైద్య చికిత్స అందుతోంది. ఈ నేపథ్యంలో రబీని రూలర్ పరామర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రబీని రూలర్ పరామర్శిస్తున్న దృశ్యాలు, గాయపడ్డ దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వద్ద ప్రమాదాలకు తావు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు రూలర్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









