గాయపడ్డ ఫుట్బాల్ ఆటగాడ్ని పరామర్శించిన మొహమ్మద్
- March 25, 2019యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతోన్న ఫుట్ బాల్ ఆటగాడ్ని పరామర్శించారు. ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా మైదానంలోనే వున్న ఓ బిగ్ పోల్ని ఢీకొని అల్ జజీరా ఆటగాడు అహ్మద్ రబీ తీవ్రంగా గాయపడ్డారు. దుబాయ్లోని రషీద్ ఆసుపత్రిలో అతనికి వైద్య చికిత్స అందుతోంది. ఈ నేపథ్యంలో రబీని రూలర్ పరామర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రబీని రూలర్ పరామర్శిస్తున్న దృశ్యాలు, గాయపడ్డ దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వద్ద ప్రమాదాలకు తావు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు రూలర్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు