యూ.ఏ.ఈ:విజిటింగ్ వీసాలతో మోసం
- April 02, 2019
దుబాయ్:ఏజెంట్ల మాయ మాటలు నమ్మి విజిటింగ్ వీసాలతో మహిళలు దుబాయ్ రావొద్దని కాన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు హెచ్చరిస్తున్నారు. విజిటింగ్ వీసాలతో దుబాయ్ వచ్చిన మహిళలను కొంతమంది ఏజెంట్లు మోసం చేస్తున్నారన్నారు. ఒక ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, దుబాయ్లో అరబ్ షేక్ల ఇంట్లో పనిమనుషులుగా చేర్పిస్తున్నారని వారన్నారు. ఇంట్లో పనిమనుషులుగా కుదిరిన తర్వాత ఆ మహిళల పాస్పోర్టు, మొబైల్ ఫోన్లను యజమానులు, ఏజెంట్లే లాగేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. పాస్పోర్టు, సరైన వీసా పత్రాలు లేకుండా పోలీసులకు చిక్కితే అరెస్ట్ చేస్తారన్నారు. ఇదిలావుండగా కాన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి యేటా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అరబ్ షేక్ల ఇంట్లో సరైన వీసా పత్రాలు లేకుండా పనిమనుషులుగా ఉన్నవారిని రక్షించి స్వదేశానికి పంపిస్తున్నారు. 2016లో 84 మంది మహిళలను, 2017లో 121 మంది మహిళలను, 2018లో 134 మంది మహిళలను భారత్ పంపించామని కాన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా విపుల్ తెలిపారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







