యూ.ఏ.ఈ:విజిటింగ్ వీసాలతో మోసం
- April 02, 2019
దుబాయ్:ఏజెంట్ల మాయ మాటలు నమ్మి విజిటింగ్ వీసాలతో మహిళలు దుబాయ్ రావొద్దని కాన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు హెచ్చరిస్తున్నారు. విజిటింగ్ వీసాలతో దుబాయ్ వచ్చిన మహిళలను కొంతమంది ఏజెంట్లు మోసం చేస్తున్నారన్నారు. ఒక ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, దుబాయ్లో అరబ్ షేక్ల ఇంట్లో పనిమనుషులుగా చేర్పిస్తున్నారని వారన్నారు. ఇంట్లో పనిమనుషులుగా కుదిరిన తర్వాత ఆ మహిళల పాస్పోర్టు, మొబైల్ ఫోన్లను యజమానులు, ఏజెంట్లే లాగేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. పాస్పోర్టు, సరైన వీసా పత్రాలు లేకుండా పోలీసులకు చిక్కితే అరెస్ట్ చేస్తారన్నారు. ఇదిలావుండగా కాన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి యేటా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అరబ్ షేక్ల ఇంట్లో సరైన వీసా పత్రాలు లేకుండా పనిమనుషులుగా ఉన్నవారిని రక్షించి స్వదేశానికి పంపిస్తున్నారు. 2016లో 84 మంది మహిళలను, 2017లో 121 మంది మహిళలను, 2018లో 134 మంది మహిళలను భారత్ పంపించామని కాన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా విపుల్ తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







