హైదరాబాద్ లో బీదర్ కోట..
- April 03, 2019
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథతో సైరా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈచిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే అనేక లొకేషన్స్లో చిత్రీకరణ జరిపారు. ఉయ్యాలవాడ జీవితంలోని కీలక ఘట్టాల్లో బీదర్ కోట ఒకటి. దీనికి సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం కోకాపేటలో బీదర్ కోట సెట్ వేశారు. ఇందులో చిరంజీవితో పాటుగా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత అంచనా ప్రకారం ఈ నెలాఖరుతో సినిమా చిత్రీకరణ పూర్తిచేస్తారు. ఆ తర్వాత విఎఫ్ఎక్స్ పనులు ప్రారంభిస్తారు. ఇందులో నయనతార, అమితాబ్ బచ్చన్, తమన్నా కీలక పాత్రధారులు. అమిత్ త్రివేది స్వరరచన చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాత.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







