హైదరాబాద్ లో బీదర్ కోట..
- April 03, 2019
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథతో సైరా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈచిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే అనేక లొకేషన్స్లో చిత్రీకరణ జరిపారు. ఉయ్యాలవాడ జీవితంలోని కీలక ఘట్టాల్లో బీదర్ కోట ఒకటి. దీనికి సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం కోకాపేటలో బీదర్ కోట సెట్ వేశారు. ఇందులో చిరంజీవితో పాటుగా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత అంచనా ప్రకారం ఈ నెలాఖరుతో సినిమా చిత్రీకరణ పూర్తిచేస్తారు. ఆ తర్వాత విఎఫ్ఎక్స్ పనులు ప్రారంభిస్తారు. ఇందులో నయనతార, అమితాబ్ బచ్చన్, తమన్నా కీలక పాత్రధారులు. అమిత్ త్రివేది స్వరరచన చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాత.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







