జెట్ ఎయిర్వేస్ను వెంటాడుతున్న కష్టాలు: నిలిచిపోయిన మరో 15 ప్లైట్లు
- April 03, 2019
ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్కు చెందిన మరో పదిహేను విమానాలు నిలిచిపోయాయి. అద్దె చెల్లించకపోవడంతో ఆ విమానాలు ఆగిపోయాయి. దీంతో జెట్ ఎయిర్వేస్ నడుపుతున్న విమానాల సంఖ్య 30 కంటే తక్కువగా ఉంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడుతూ.. ఈ సంస్థ తరఫున కేవలం 29 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పారట.
నిధుల కొరతతో జెట్ ఎయిర్వేస్ను కష్టాలు వెంటాడుతోన్న విషయం తెలిసిందే. ఈ సంస్థను గట్టెక్కించేందుకు రుణదాతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చైర్మన్ నరేష్ గోయల్ను, అతని సతీమణిని బోర్డు నుంచి తప్పుకోమని ఒత్తిడి చేసారు. వీరు వారం క్రితం తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సంస్థను గట్టెక్కించేందుకు బ్యాంకర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ, తాజాగా మరో పదిహేను విమానాలు నిలిచిపోయాయి. లీజుకు సంబంధించి చెల్లింపులు జరుపకపోవడం వల్లనే ఈ విమాన సర్వీసులను రద్దు చేసుకుంది. మరోవైపు, తమకు బకాయిపడిన జీతాలపై వడ్డీలు చెల్లించాలని జెట్ ఎయిర్వేస్ పైలెట్లు డిమాండ్ చేస్తున్నారు. నియంత్రణ మండలి డీజీసీఏకు రాసిన లేఖలో ది నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(ఎన్ఏజీ) ఈ విషయాన్ని ప్రస్తావించారు. జనవరి నుంచి పైలెట్లు, ఇంజినీర్లకు వేతనాలు చెల్లించాల్సి ఉంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







