జెట్ ఎయిర్వేస్ను వెంటాడుతున్న కష్టాలు: నిలిచిపోయిన మరో 15 ప్లైట్లు
- April 03, 2019
ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్కు చెందిన మరో పదిహేను విమానాలు నిలిచిపోయాయి. అద్దె చెల్లించకపోవడంతో ఆ విమానాలు ఆగిపోయాయి. దీంతో జెట్ ఎయిర్వేస్ నడుపుతున్న విమానాల సంఖ్య 30 కంటే తక్కువగా ఉంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడుతూ.. ఈ సంస్థ తరఫున కేవలం 29 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పారట.
నిధుల కొరతతో జెట్ ఎయిర్వేస్ను కష్టాలు వెంటాడుతోన్న విషయం తెలిసిందే. ఈ సంస్థను గట్టెక్కించేందుకు రుణదాతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చైర్మన్ నరేష్ గోయల్ను, అతని సతీమణిని బోర్డు నుంచి తప్పుకోమని ఒత్తిడి చేసారు. వీరు వారం క్రితం తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సంస్థను గట్టెక్కించేందుకు బ్యాంకర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ, తాజాగా మరో పదిహేను విమానాలు నిలిచిపోయాయి. లీజుకు సంబంధించి చెల్లింపులు జరుపకపోవడం వల్లనే ఈ విమాన సర్వీసులను రద్దు చేసుకుంది. మరోవైపు, తమకు బకాయిపడిన జీతాలపై వడ్డీలు చెల్లించాలని జెట్ ఎయిర్వేస్ పైలెట్లు డిమాండ్ చేస్తున్నారు. నియంత్రణ మండలి డీజీసీఏకు రాసిన లేఖలో ది నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(ఎన్ఏజీ) ఈ విషయాన్ని ప్రస్తావించారు. జనవరి నుంచి పైలెట్లు, ఇంజినీర్లకు వేతనాలు చెల్లించాల్సి ఉంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







