జెట్ ఎయిర్వేస్ను వెంటాడుతున్న కష్టాలు: నిలిచిపోయిన మరో 15 ప్లైట్లు
- April 03, 2019
ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్కు చెందిన మరో పదిహేను విమానాలు నిలిచిపోయాయి. అద్దె చెల్లించకపోవడంతో ఆ విమానాలు ఆగిపోయాయి. దీంతో జెట్ ఎయిర్వేస్ నడుపుతున్న విమానాల సంఖ్య 30 కంటే తక్కువగా ఉంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడుతూ.. ఈ సంస్థ తరఫున కేవలం 29 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పారట.
నిధుల కొరతతో జెట్ ఎయిర్వేస్ను కష్టాలు వెంటాడుతోన్న విషయం తెలిసిందే. ఈ సంస్థను గట్టెక్కించేందుకు రుణదాతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చైర్మన్ నరేష్ గోయల్ను, అతని సతీమణిని బోర్డు నుంచి తప్పుకోమని ఒత్తిడి చేసారు. వీరు వారం క్రితం తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సంస్థను గట్టెక్కించేందుకు బ్యాంకర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ, తాజాగా మరో పదిహేను విమానాలు నిలిచిపోయాయి. లీజుకు సంబంధించి చెల్లింపులు జరుపకపోవడం వల్లనే ఈ విమాన సర్వీసులను రద్దు చేసుకుంది. మరోవైపు, తమకు బకాయిపడిన జీతాలపై వడ్డీలు చెల్లించాలని జెట్ ఎయిర్వేస్ పైలెట్లు డిమాండ్ చేస్తున్నారు. నియంత్రణ మండలి డీజీసీఏకు రాసిన లేఖలో ది నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(ఎన్ఏజీ) ఈ విషయాన్ని ప్రస్తావించారు. జనవరి నుంచి పైలెట్లు, ఇంజినీర్లకు వేతనాలు చెల్లించాల్సి ఉంది.
తాజా వార్తలు
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!









