జెట్ ఎయిర్వేస్ను వెంటాడుతున్న కష్టాలు: నిలిచిపోయిన మరో 15 ప్లైట్లు
- April 03, 2019
ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్కు చెందిన మరో పదిహేను విమానాలు నిలిచిపోయాయి. అద్దె చెల్లించకపోవడంతో ఆ విమానాలు ఆగిపోయాయి. దీంతో జెట్ ఎయిర్వేస్ నడుపుతున్న విమానాల సంఖ్య 30 కంటే తక్కువగా ఉంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడుతూ.. ఈ సంస్థ తరఫున కేవలం 29 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పారట.
నిధుల కొరతతో జెట్ ఎయిర్వేస్ను కష్టాలు వెంటాడుతోన్న విషయం తెలిసిందే. ఈ సంస్థను గట్టెక్కించేందుకు రుణదాతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చైర్మన్ నరేష్ గోయల్ను, అతని సతీమణిని బోర్డు నుంచి తప్పుకోమని ఒత్తిడి చేసారు. వీరు వారం క్రితం తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సంస్థను గట్టెక్కించేందుకు బ్యాంకర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ, తాజాగా మరో పదిహేను విమానాలు నిలిచిపోయాయి. లీజుకు సంబంధించి చెల్లింపులు జరుపకపోవడం వల్లనే ఈ విమాన సర్వీసులను రద్దు చేసుకుంది. మరోవైపు, తమకు బకాయిపడిన జీతాలపై వడ్డీలు చెల్లించాలని జెట్ ఎయిర్వేస్ పైలెట్లు డిమాండ్ చేస్తున్నారు. నియంత్రణ మండలి డీజీసీఏకు రాసిన లేఖలో ది నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(ఎన్ఏజీ) ఈ విషయాన్ని ప్రస్తావించారు. జనవరి నుంచి పైలెట్లు, ఇంజినీర్లకు వేతనాలు చెల్లించాల్సి ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..