కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి
- April 05, 2019
దుబాయ్:90 ఏళ్ళ ఎమిరేటీ మహిళ, తన కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయింది. తనయుడి మృతదేహం పక్కనే తల్లి మృతదేహాన్ని ఖననం చేశారు కుటుంబ సభ్యులు. గత నవంబర్లో అహ్మద్ అనే 68 ఏళ్ళ వ్యక్తికి నెక్ క్యాన్సర్ సోకింది. జర్మనీకి ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్ళి, స్వదేశానికి తిరిగొచ్చారు. ఇంకోపక్క, వయసు మీద పడ్డంతో పలు అనారోగ్య సమస్యలతో రెండు నెలలుగా తన తల్లి కోమాలో వుందని మృతురాలి మరో తనయుడు అబ్దుల్సలామ్ సలెహ్ చెప్పారు. సలెహ్ సోదరుడు అహ్మద్, రషీద్ ఆసుపత్రిలో చికిత్స పొందాడనీ, అదే ఆసుపత్రిలో తన తల్లి కూడా చికిత్స పొందిందనీ, ఏప్రిల్ 2న తన సోదరుడు ప్రాణాలు కోల్పోగా, కోమాలోంచి తన తల్లి బయటకు వచ్చిందనీ, దురదృష్టవశాత్తూ అహ్మద్ని ఖననం చేసిన రెండు గంటల తర్వాత తన తల్లి ప్రాణం కోల్పోయిందని చెప్పారు సలెహ్. అల్ ఖోజ్ సిమిటెరీలో తన సోదరుడి సమాధి పక్కనే తన తల్లి సమాధిని కూడా ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







