ఎప్పుడప్పుడా అని చూస్తున్న హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ప్లైఓవర్ ప్రారంభం

- April 07, 2019 , by Maagulf
ఎప్పుడప్పుడా అని చూస్తున్న హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ప్లైఓవర్ ప్రారంభం

నగరవాసులు ఎప్పుడప్పుడా అని చూస్తున్న హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ప్లైఓవర్ ప్రారంభమైంది. మలేషియన్ టౌన్‌షిప్‌ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి జేఎన్‌టీయూ వరకు నిర్మించిన ప్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్లై ఓవర్ ప్రారంభించాలని నగరవాసుల డిమాండ్‌ మేరకు ఎన్నికల కోడ్‌ ఉన్న నేపథ్యంలో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా ప్లై ఓవర్‌ను ప్రారంభించారు. 1.20 కిలో మీటర్ల పోడవు ఉన్న ఈ ప్లైఓవర్‌ను 97 కోట్ల వ్యయంతో నిర్మించారు.
 
లక్షలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను సామాజిక మాద్యమాల ద్వారా నెటిజన్లు ఫిర్యాదు చేశారు. నిజాంపేట్‌, ప్రగతి నగర్‌, కూకట్ పల్లి నుంచి హైటెక్‌ సిటీకి ఇరువైపుల రోజుకు దాదాపు లక్షా అరవై వేల వావానాలు ప్రయాణిస్తున్నాయి . ఎట్టకేలకు ప్లైఓవర్ ప్రాంరంభం కావడంతో కూకట్‌పల్లి రాజీవ్‌ గాంధీ విగ్రహం నుంచి మలేషియన్‌ టౌన్‌ షిప్‌ మీదుగా హైటెక్ సిటీకి వెళ్లే లక్షలాది మంది నగరవారసులు సాఫీగా , సులభంగా ప్రయాణం చేసేందుకు వీలయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com