పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళాడు..చివరకు..
- April 07, 2019
తెలంగాణ చెందిన యువతి ఆమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి అమెరికాలోని టెక్సాస్లో
గొంతు కొసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం. తొర్రూరు మండలంలోని చింతలపల్లికి చెందిన సెగ్గెం మహేందర్, విమలమ్మ దంపతులకు ముగ్గురు కూమర్తెలు.
అయితే ఎనిమిది నెలల క్రితం వీరి చిన్న కుమార్తె సంధ్యను తొర్రూరుకు చెందిన సమీప బంధువు దూంపల్లి శ్రీకాంత్కు ఇచ్చి వివాహం చేశారు. యుఎస్లో సాప్ట్వేర్ ఇంజీనిర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ తన తల్లిదండ్రులతొ కలిసి అక్కడే నివాసిస్తున్నాడు. వివాహం అనంతరం భార్యను కూడా అక్కడికి తీసుకెళ్ళాడు. ఆరు నెలల వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది. కొద్దినెలల నుంచి సంధ్యను అదనపు కట్నం కోసం శ్రీకాంత్, అతని తల్లిదండ్రులు వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. దీంతో మనస్థాపం చెందిన ఆమె గొంతు గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. గదిలో విగితా జీవిగా పడిఉన్న సంధ్య చూసిన శ్రీకాంత్ తను అత్మహత్య చేసుకున్నట్లు భారత్లోని ఆమె బంధువులకు తెలియజేశాడు. అనంతరం సంధ్య తండ్రి మహేందర్ తొర్రూరు పోలీసు స్టేషన్లో శ్రీకాంత్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







