పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళాడు..చివరకు..
- April 07, 2019
తెలంగాణ చెందిన యువతి ఆమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి అమెరికాలోని టెక్సాస్లో
గొంతు కొసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం. తొర్రూరు మండలంలోని చింతలపల్లికి చెందిన సెగ్గెం మహేందర్, విమలమ్మ దంపతులకు ముగ్గురు కూమర్తెలు.
అయితే ఎనిమిది నెలల క్రితం వీరి చిన్న కుమార్తె సంధ్యను తొర్రూరుకు చెందిన సమీప బంధువు దూంపల్లి శ్రీకాంత్కు ఇచ్చి వివాహం చేశారు. యుఎస్లో సాప్ట్వేర్ ఇంజీనిర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ తన తల్లిదండ్రులతొ కలిసి అక్కడే నివాసిస్తున్నాడు. వివాహం అనంతరం భార్యను కూడా అక్కడికి తీసుకెళ్ళాడు. ఆరు నెలల వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది. కొద్దినెలల నుంచి సంధ్యను అదనపు కట్నం కోసం శ్రీకాంత్, అతని తల్లిదండ్రులు వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. దీంతో మనస్థాపం చెందిన ఆమె గొంతు గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. గదిలో విగితా జీవిగా పడిఉన్న సంధ్య చూసిన శ్రీకాంత్ తను అత్మహత్య చేసుకున్నట్లు భారత్లోని ఆమె బంధువులకు తెలియజేశాడు. అనంతరం సంధ్య తండ్రి మహేందర్ తొర్రూరు పోలీసు స్టేషన్లో శ్రీకాంత్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







