రమదాన్ పండుగ..సౌదీ యువరాజు తియ్యటి కానుక
- April 11, 2019రియాద్: రమదాన్ పండుగ సందర్భంగా సౌదీ యువరాజు ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాలకు సమృద్ధిగా పోషకాలు కలిగిన ఖర్జూర పండ్లను బహుమతిగా పంపనున్నారని అధికారులు తెలిపారు. దాదాపు 6500 టన్నుల ఖర్జూరలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వారు చెబుతున్నారు. రమదాన్ పండుగ కోసం ఉపవాస దీక్ష చేపట్టేవారికి ఈ పండ్లు ఎంతో ఉపయోగకరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఖర్జూరలను పంచే కార్యక్రమం దశలవారిగా చేపట్టనున్నారు. మొదటి దశలో 4వేల టన్నుల ఖర్జూరలను 14 దేశాలకు పంపినున్నట్లు అధికారులు తెలిపారు. రెండో దశలో మిగిలిన 2500 టన్నుల ఖర్జూరలను 29 దేశాలకు పంపించనున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..