రమదాన్ పండుగ..సౌదీ యువరాజు తియ్యటి కానుక

- April 11, 2019 , by Maagulf
రమదాన్ పండుగ..సౌదీ యువరాజు తియ్యటి కానుక

రియాద్: రమదాన్ పండుగ సందర్భంగా సౌదీ యువరాజు ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాలకు సమృద్ధిగా పోషకాలు కలిగిన ఖర్జూర పండ్లను బహుమతిగా పంపనున్నారని అధికారులు తెలిపారు. దాదాపు 6500 టన్నుల ఖర్జూరలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వారు చెబుతున్నారు. రమదాన్ పండుగ కోసం ఉపవాస దీక్ష చేపట్టేవారికి ఈ పండ్లు ఎంతో ఉపయోగకరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఖర్జూరలను పంచే కార్యక్రమం దశలవారిగా చేపట్టనున్నారు. మొదటి దశలో 4వేల టన్నుల ఖర్జూరలను 14 దేశాలకు పంపినున్నట్లు అధికారులు తెలిపారు. రెండో దశలో మిగిలిన 2500 టన్నుల ఖర్జూరలను 29 దేశాలకు పంపించనున్నామని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com