అబుదాబీ ట్యాక్సీల్లో వైఫై
- December 31, 2015
అబుదాబీ ట్యాక్సీలు ఇకపై ప్రయాణీకులకు వైఫై సౌకర్యాన్ని అందించనుంది. అయితే ఏమాత్రం అదనపు ఖర్చూ లేకుండా ప్రయాణీకులు వైఫై సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. 'వన్ టారిఫ్ ఫర్ ఆల్ సిల్వర్ ట్యాక్సీస్' అనే క్యాంపెయిన్ బుధవారం ప్రారంభమయ్యింది. అబుదాబీలోని నాలుగు ప్రాంతాల్లో ఈ క్యాంపెన్ని ప్రారంభించారు. సిల్వర్ ట్యాక్సీస్ విభాగంలో 270 మెర్సిడెస్ విటో కాంపాక్ట్ ట్యాక్సీలను కొత్తగా పొందుపరిచారు. ప్రయాణీకులకు అందించే సౌకర్యాల గురించి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యమని జనరల్ మేనేజర్ మహమ్మద్ దర్విష్ అల్ కెమిజి చెప్పారు. వైఫై సర్వీసులతోపాటు, చిల్డ్రన్ సేఫ్టీ కార్ సీట్స్ని తమ ట్యాక్సీలలో వినియోగిస్తున్నామని ఆయన అన్నారు. అలాగే ఎలక్ట్రానిక్ డిస్కౌంట్ కార్డులు సామాజిక సబ్సిడీ బెనిఫీసియర్స్ కోసం అందించనున్నారట. విడాకులు తీసుకున్న మహిళలకు, భర్త చనిపోయిన భార్యలతోపాటు సోషల్ సబ్సిడీ ఉన్నవారికి ఛార్జీల్లో 60 శాతం డిస్కౌంట్ ఉంటుంది
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







