శబరిమల పిటిషన్ కి ధీటుగా సుప్రీం లో ముస్లింల పిటిషన్..

- April 16, 2019 , by Maagulf
శబరిమల పిటిషన్ కి ధీటుగా సుప్రీం లో ముస్లింల పిటిషన్..

న్యూఢిల్లీ: మసీదుల్లోకి మహిళా ప్రవేశం చేయొచ్చా లేదా అనే అంశంపై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆ అంశంపై పిటిషన్‌ను పరిశీలించినట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కూడా సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయ ప్రవేశం చేయోచ్చంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పు ఆధారంగానే తాము మసీదుల్లోకి ముస్లిం మహిళలు వెళ్లవచ్చా అనే అంశాన్ని తేల్చాలని భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ను మహారాష్ట్రకు చెందిన ఓ జంట వేసింది. మహిళలను మసీదులోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం అక్రమమని పిటిషన్‌లో తెలిపారు. అది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. దీంతో 14, 15, 21, 25, 29 ఆర్టికల్స్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని కూడా పిటిషన్‌లో తెలిపారు. ఏ మత గురువు కూడా మసీదుకు వెళ్లరాదని అని చెప్పలేదని పిటిషన్‌లో చెప్పారు. స్త్రీ పురుషులను ఖురాన్‌ వేరువేరుగా చూడలేదన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com