ఆర్మ్డ్ రోబరీ: 8 మందికి మరణ శిక్ష
- April 18, 2019
క్రిమినల్ కోర్ట్ ఆఫ్ షార్జా, 8 మంది వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. షార్జాలోని ఓ మనీ ఎక్స్ఛేంజ్ సెంటర్లో జరిగిన దొంగతనానికి సంబంధించి దోషులకు న్యాయస్థానం మరణ శిక్ష ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా జాతీయులపై ఆర్మ్డ్ రోబరీ, పబ్లిక్ని భయభ్రాంతులకు గురిచేయడం, డబ్బుని దొంగిలించడం వంటి కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో మరో వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ కేసులో కొందరు తమ నేరాన్ని అంగీకరించగా, మరికొందరు అంగీకరించలేదని తెలుస్తోంది. పోలీసు విచారణలో, నిందితుల దాష్టీకం బయటపడింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించి, వారిపై నేరాభియోగాల్ని నిరూపించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







