ఆర్మ్‌డ్‌ రోబరీ: 8 మందికి మరణ శిక్ష

- April 18, 2019 , by Maagulf
ఆర్మ్‌డ్‌ రోబరీ: 8 మందికి మరణ శిక్ష

క్రిమినల్‌ కోర్ట్‌ ఆఫ్‌ షార్జా, 8 మంది వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. షార్జాలోని ఓ మనీ ఎక్స్‌ఛేంజ్‌ సెంటర్‌లో జరిగిన దొంగతనానికి సంబంధించి దోషులకు న్యాయస్థానం మరణ శిక్ష ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా జాతీయులపై ఆర్మ్‌డ్‌ రోబరీ, పబ్లిక్‌ని భయభ్రాంతులకు గురిచేయడం, డబ్బుని దొంగిలించడం వంటి కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో మరో వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ కేసులో కొందరు తమ నేరాన్ని అంగీకరించగా, మరికొందరు అంగీకరించలేదని తెలుస్తోంది. పోలీసు విచారణలో, నిందితుల దాష్టీకం బయటపడింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించి, వారిపై నేరాభియోగాల్ని నిరూపించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com