ఆర్మ్డ్ రోబరీ: 8 మందికి మరణ శిక్ష
- April 18, 2019
క్రిమినల్ కోర్ట్ ఆఫ్ షార్జా, 8 మంది వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. షార్జాలోని ఓ మనీ ఎక్స్ఛేంజ్ సెంటర్లో జరిగిన దొంగతనానికి సంబంధించి దోషులకు న్యాయస్థానం మరణ శిక్ష ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా జాతీయులపై ఆర్మ్డ్ రోబరీ, పబ్లిక్ని భయభ్రాంతులకు గురిచేయడం, డబ్బుని దొంగిలించడం వంటి కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో మరో వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ కేసులో కొందరు తమ నేరాన్ని అంగీకరించగా, మరికొందరు అంగీకరించలేదని తెలుస్తోంది. పోలీసు విచారణలో, నిందితుల దాష్టీకం బయటపడింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించి, వారిపై నేరాభియోగాల్ని నిరూపించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







