శ్రీలంక:ముగ్గురు పిల్లలను పోగొట్టుకున్న బిలియనీర్
- April 22, 2019శ్రీలంకలో జరిగిన మరణహోమం చాలా మంది కుటుంబాల్లో విషాదం నింపింది. ఆ పేలుళ్ళు డెన్మార్క్కు చెందిన బిలియనీర్ ఇంట్లో తీవ్ర విషాదానికి కారణమైంది. ఆ పేలుళ్లలో ఆయన పిల్లల్లో ముగ్గురు మరణించారు. ఈస్టర్ సందర్భంగా అసోస్ యజమాని ఆండర్స్ హోల్చ్ పోల్సెన్ కుటుంబం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం వారు రెస్టారెంట్లో ఉన్న సమయంలో బాంబు పేలుళ్ళు సంభవించాయి.
ఈ బాంబు దాడిలో ఆండర్స్ ముగ్గురు పిల్లలు బలయ్యారు. అయితే ఆ ఘటనకు సంబంధించి ఆండర్స్ కుటుంబం ఎలాంటి ప్రకటన చేయలేదు. చనిపోయిన ముగ్గురు పిల్లల పేర్లను కూడా బయటపెట్టలేదు. ఇంటర్నేషనల్ టెక్స్ట్ టైల్ బ్రాండ్ సంస్ధకు బెస్ట్ సెల్లర్కు పోల్సెస్ అధినేత. అలాగే 11 స్కాటిష్ ఎస్టేట్లు, ఒక క్యాజిల్ ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి. అంతేకాక అలాగే అసోస్లో ఏకైక అదిపెద్ద షేర్ హోల్డర్. యుకేలో రీయల్ ఎస్టేటర్గా ఆండర్స్ పేరుంది. ఈ ఘటనలో 290 మంది మృతి చెందగా..500 మందికి పైగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..