అమెరికా ప్రయాణం మరింత కఠినం..
- April 27, 2019
అమెరికా ప్రయాణం మరింత కఠినం కానుంది. విజిటింగ్ వీసా మరింత అనేక మార్పులు చేస్తోంది ట్రంప్ సర్కారు. భారతీయులే టార్గెట్గా.. అడ్మిషన్ బాండ్స్ ను ప్రవేశపెట్టనుంది. ఇదే జరిగితే.. అమెరికాను సందర్శించేందుకు వచ్చే టూరిస్టులు, వ్యాపారులు, ముఖ్యంగా భారతీయులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు.
భారతీయులే టార్గెట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వీసా చట్టాన్ని కఠినతరం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాను సందర్శించేందుకు వచ్చే టూరిస్టులు, బిజినెస్ పీపుల్, ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఇబ్బందులకు గురవ్వనున్నారు. విజిటింగ్ వీసాలను అడ్డుకునేందుకు అమెరికా విదేశాంగ శాఖ అడ్మిషన్ బాండ్స్ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి వైట్హౌస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
గత నవంబర్ నాటికే అమెరికాలో మొత్తం 1.96 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. వీరి సంఖ్య అమెరికాలో విద్యనభ్యసిస్తున్న మొత్తం విదేశీ విద్యార్థుల్లో.. 18 శాతం కావడం విశేషం. కాగా 2013లో యూకే సైతం విజిటింగ్ వీసాలను కట్టడి చేసేందుకు ఇలాంటి సెక్యూరిటీ బాండ్ల విధానాన్నే ప్రవేశపెట్టింది.
మొత్తం ఆరు దేశాలకు చెందిన పౌరులు యూకేను సందర్శించాలంటే 3వేల పౌండ్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని నిబంధన పెట్టింది. అయితే ఎంపిక చేసిన 6 దేశాల్లో భారత్ కూడా ఉంది. ప్రధానంగా అమెరికాకు వచ్చే బిజినెస్, టూరిస్ట్ ఇతర నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను తగ్గించే దిశగా ట్రంప్ ఈ చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







